భవిష్యత్ తరాలకు మెరుగైన పట్టణం, రాష్ట్రం అందించాలన్న సంకల్పంతో హరితహారం కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. సోమవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 25న ప్రారంభం కానున్న ఆరో విడత హరితహారం కార్యక్రమంపై సక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకులు వారికి లబ్ది చేకూరేలా, వోట్లు వచ్చే, మళ్లీ ఎన్నికల్లో గెలిచే కార్యక్రమాలపై దృష్టి పెడుతారని, కానీ ముఖ్యమంతి కేసీఆర్ మాత్రం వచ్చే ఎన్నికలు కాదు, రాబోయే తరాలు బాగుండాలన్న ఉద్దేశంతో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించా రన్నారు. మన పిల్లలకు.. మనకు వారసత్వంగా ఇచ్చిన హైదరాబాద్ కంటే మెరుగైన పట్టణం, రాష్టాన్ని్ర భవిష్యత్ తరాలకు అందించాలని దృఢమైన సంకల్పంతో కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాలకు వెళ్లినప్పుడు, ఔటర్ రింగ్రోడ్డుపై చెట్లు పెరిగి పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుందన్నారు.
అలాగే ఇతర రాష్టాల్రు, దేశాల నుంచి వచ్చిన వారు ఎయిర్పోర్టులో దిగి, ఔటర్ రింగ్రోడ్డు దుగా హైదరాబాద్కు వచ్చేటప్పుడు బాగా కనిపిస్తుందని, చెట్లు మంచిగున్నయని చెప్పినప్పుడు గర్వంగా అనిపిస్తుందన్నారు. గ్రామాల్లో ప్రస్తుతం చెట్లు పెట్టాలన్న కల్చర్ వచ్చిందన్నారు. గ్రామాల్లో మా కోసం చేస్తున్న అమలు చేస్తున్న కార్యక్రమమని, రాజకీయంగా ఏ లబ్ది లేదు.. మంచి ఆలోచన, మంచి మనస్సుతో చేపట్టిన కార్యక్రమమని ప్రజల్లోకి వెళ్లిందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ ఏడాది కూడా హైదరాబాద్లో భారీ ఎత్తున హరితహారం కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. మొక్కలు నాటడం, కాపాడడం సామాజిక బాధ్యతని, హైదరాబాద్లో ఉన్న పౌరులందరూ మొక్కలు నాటాలని కోరారు. పిల్లలకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అందరికీ మొక్కలు అందజేస్తామని తెలిపారు. ఈ నెల 25 నుంచి ఆగస్టు 15 వరకు హరితహారం కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, పట్టణాభివృద్దిశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్, కమిషనర్ లోకేశ్కుమార్, ఎమ్మెల్యేలు సుధీర్రెడ్డి, దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.