తాజాగా 137 మందికి పాజిటివ్.. ఇద్దరు మృతి
రాష్ట్రంలో రోజువారీ కొరోనా కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 137 కేసులు నమోదయ్యాయి. కాగా వైరస్ నుంచి 172 మంది కోలుకున్నారు. కాగా వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందారు. జిహెచ్ఎంసి పరిధిలో కొత్తగా 54 కేసులు నమోదవగా, కరీంనగర్ జిల్లాలో 15 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 11 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,74,692 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,983కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,67,171 కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 3,538గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది.