Take a fresh look at your lifestyle.

జగిత్యాల జిల్లాలో మరో ఐదుగురికి కొరోనా పాజిటివ్‌

‌ముంబాయికి వలస పోయి తిరిగి జగిత్యాల జిల్లాకు చేరుకుంటున్న స్థానికుల రూపంలో కొరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. శుక్రవారం జగిత్యాల జిల్లాలో మరో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. రాయికల్‌ ‌మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు, పెగడపల్లి మండలానికి చెందిన ఇద్దరికి, మల్యాల మండలానికి చెందిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యిందని జిల్లా వైద్యాధికారి శ్రీధర్‌ ‌తెలిపారు. మరో ముగ్గురి శాంపిల్స్ ‌పంపడం జరిగిందని వీరి ఫలితాలు రావాల్సి ఉందన్నారు.

వీరంతా ముంబాయి వలస కార్మికులని శుక్రవారం రోజున జగిత్యాల జిల్లాకు చేరుకున్న ఇతర రాష్ట్రాల వలసల సంఖ్య 97 మంది అని అందులో ముంబై నుంచి వచ్చిన వారి సంఖ్య 85 అని చెప్పారు. నేటి వరకు జగిత్యాల జిల్లాకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి సంఖ్య 6034 కాగా ఇందులో మహారాష్ట్రకు చెందిన వారు 5514గా జిల్లా వైద్యాదికారి శ్రీధర్‌ ‌తెలిపారు.

Leave a Reply