Take a fresh look at your lifestyle.

సుప్రీమ్‌ ‌కోర్టుకు మరో ఐదుగురు జడ్జీలు

  • కొలీజియం సిఫార్సుల మేరకు నిర్ణయం
  • సుప్రీమ్‌ ‌కోర్టుకు తెలిపిన అటార్నీ జనరల్‌  
  • ఆమోదంలో ఆలస్యంపై మండిపడ్డ ధర్మాసనం

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 3 : త్వరలో ఐదుగురు నూతన జడ్జీలను నియమకానికి కేంద్రం గ్రీన్‌సిగల్‌ ఇవ్వనుంది. జడ్జీల నియామకంలో జాప్యంపై దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కొలీజియం సిఫారసు చేసిన ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఇద్దరు న్యాయమూర్తులను సుప్రీంకోర్టుకు పదన్నోతి కల్పించే అంశాన్ని క్లియర్‌ ‌చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఐదుగురు జడ్జీల నియామకంపై త్వరలో స్పష్టత వస్తుందని కేంద్రం వెల్లడించింది. దీంతో సిజెఐతో కలిపి సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యా బలం 32కి చేరుతుంది.

ప్రస్తుతం సుప్రీంకోర్టులో 27 మంది న్యాయమూర్తులు ఉన్నారు. ••జస్థాన్‌ ‌హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌పంకజ్‌ ‌మిథాల్‌, ‌పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌సంజరు కరోల్‌, ‌మణిపూర్‌ ‌హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌పి.వి. సంజరు కుమార్‌, ‌పాట్నా హైకోర్టు న్యాయమూర్తి అసదుద్దీన్‌ అమానుల్లా, అలహాబాద్‌ ‌హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ‌మనోజ్‌ ‌మిశ్రాలను సుప్రీంకోర్టుకు గతేడాది డిసెంబర్‌ 13‌న కొలీజియం సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. ఐదుగురు హైకోర్టు న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ 2022 డిసెంబర్‌లో సుప్రీంకోర్టు కొలీజియం  చేసిన సిఫార్సులకు కేంద్రం త్వరలోనే క్లియరెన్స్ ఇవ్వనున్నట్టు భారత అటార్నీ జనరల్‌  ఆర్‌.‌వెంకటరమణి శుక్రవారంనాడు అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేశారు. పెండింగ్‌లో ఉన్న కొలీజియం సిఫార్సుల తాజా పరిస్థితిపై సుప్రీంకోర్టు ధర్మాసనం అడిగిన ప్రశ్నకు ఏజీ సమాధానమిస్తూ, జడ్జీల నియామకాలను ఆదివారంనాడు జారీ చేయనున్నట్టు కోర్టుకు తెలిపారు.

న్యాయ నియామకాలపై కేంద్ర ఎలాంటి టైమ్‌-‌లైన్‌ ‌పాటించడం లేదంటూ బెంగళూరు అడ్వకేట్స్ అసోసియేషన్‌ ‌వేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌పై జస్టిస్‌ ఎస్‌.‌కె.కౌల్‌, ‌జస్టిస్‌ ఏఎస్‌ ఓకలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. డిసెంబర్‌లో 5 పేర్లు ప్రతిపాదించాం. ఇప్పుడు మనం ఫిబ్రవరిలో ఉన్నాంఅని విచారణకు హాజరైన ఏజీని ఉద్దేశించి జస్టిస్‌ ‌కౌల్‌ అన్నారు. ఆ పేర్లను క్లియర్‌ ‌చేయాల్సి ఉంటుందని న్యాయమూర్తి అన్నారు. ఎప్పుడు వారెంట్లు ఇష్యూ చేస్తారని ప్రశ్నించారు. దీనిపై ఏజీ సమాధానమిస్తూ, ఆదివారంనాడు జారీ చేస్తారని తెలుస్తోందని, ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద ఇవి ఉన్నాయని, శుక్రవారం సాయంత్రానికి క్లియెరెన్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అన్నారు. దీనిపై జస్టిల్‌ ‌కౌల్‌ ‌స్పందిస్తూ, సుప్రీంకోర్టు సిఫార్సు చేసిన ఐదుగురు పేర్లు పరిశీలనలో ఉన్నాయని అటార్జీ జనరల్‌ ‌కోర్టుకు వివరించినందున గరిష్టంగా ఐదు రోజుల్లోగా నియామాకాలు జారీ చేయాల్సి ఉంటుందని అన్నారు. అయితే ఉత్తర్వుల్లో ఎన్ని రోజులనే దానిని రికార్డు చేయవద్దని, ఆదివారంనాటికి వారెంట్లు జారీ అవుతాయని అన్నారు. ఇది చాలా సీరియస్‌ అం‌శమని, నియామకాల్లో జరుగుతున్న తీవ్ర జాప్యాల కారణంగా ధర్మాసనం ఇబ్బందికరమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి కల్పించవద్దని ఆయన జస్టిల్‌ ‌కౌల్‌ ‌స్పష్టం చేశారు. కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 13వ తేదీకి వాయిదా వేశారు.

Leave a Reply