ఇప్పటి వరకూ వెహికిల్కు ఫాస్టాగ్ తీసుకోలేదని ఆందోళన చెందుతున్న వారికి కేంద్రం మరో అవకాశం ఇచ్చింది. నిజానికి గతంలో ప్రకటించిన విధంగా జనవరి 1 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఈ గడువును ఫిబ్రవరి 15, 2021 వరకు పొడిగించింది. నిజానికి జనవరి 1 నుంచే దేశవ్యాప్తంగా అన్ని వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి అని డిసెంబర్ 24న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఇప్పుడా డెడ్లైన్ను కాస్త పొడిగించారు. 2016లో తీసుకొచ్చిన ఈ కొత్త ఫాస్టాగ్ విధానం వల్ల టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు టోల్ చెల్లించడానికి ఆగాల్సిన అవసరం ఉండదు.
దీనివల్ల విలువైన సమయం ఆదా అవుతుందని ప్రభుత్వం చెబుతూ వొస్తోంది. డిసెంబర్ 1, 2017 నుంచి కొత్త ఫోర్ వీలర్ వెహికిల్స్ రిజిస్ట్రేషన్కు ఫాస్టాగ్ను తప్పనిసరి చేశారు. దీంతో వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. వాహనదారులు ముందుగానే ఫాస్టాగ్ చేసుకోవాలని, లేదంటే రెండితల రోడ్డు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. వాహనదారుల నగదు చెల్లింపుల స్వస్థి పలికేందుకే టోల్ ప్లాజాల వద్ద ఫాస్టగ్ ఉన్న వాహనాలను అనుమతించాలని ఉత్తర్వులు జారీ చేశారని ప్లాజా అధికారులు అన్నారు. ఫాస్టగ్ వాహనం టోల్ ప్లాజా వరుసలోకి వస్తే రెండితలు నగదు వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని అన్నారు. ఇది గమనించి వాహనదారులు వెంటనే ఫాస్టాగ్ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.