”తెలంగాణ బిజెపి శాసనసభ్యుడు రాజా సింగ్ తో పాటుగా మరో ముగ్గురు హిందూ అతివాదులు ఫేస్ బుక్ లో ఒక మతానికి వ్యతిరేకంగా వెదజల్లిన ద్వేషం పోస్టులన్నీ ఫేస్ బుక్ కంటెంట్ మోనిటరింగ్ టీం గమనించి, రాజాసింగ్ చేసే పోస్టులు విద్వేషాన్ని రేపేవిగా ఉన్నాయని నిర్ధారించింది. ఫేస్ బుక్ కంటెంట్ మోనిటరింగ్ టీం ప్రకారం, రాజా సింగ్ అలాగే మరో ముగ్గురు అతివాదులు ఫేస్ బుక్ అకౌంట్లు డేంజరస్ కేటగిరీలోకి వస్తాయి. అందుకే వీరి పోస్టులను డిలీట్ చేసి వీరి ఎకౌంట్లను బ్యాన్ చేయాలని నిర్ణయించింది. అయితే ఫేస్ బుక్ ఇండియా హెడ్ అంకి దాస్.. తెలంగాణ బిజెపి శాసనసభ్యుడు రాజా సింగ్ తో పాటుగా మరో ముగ్గురు హిందూ అతివాదుల ఫేస్ బుక్ ఎకౌంట్లు డిలీట్ చేయవద్దు అని ఫేస్ బుక్ యాజమాన్యానికి అప్పీల్ చేశారు.”
అంతర్జాతీయ వార్తా పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం
ఫేస్ బుక్ భారతదేశంలో అధికార పార్టీ బీజేపీకి అనుకూలంగా ఉండేలాగా విద్వేషం రేపే కంటెంట్ ను ప్రోత్సహిస్తున్నదన్న వార్త ప్రపంచంలో ట్రెండ్ అవుతున్నది. ఈ వార్తా కథనాన్ని రాసింది. డి వాల్ స్ట్రీట్ జర్నల్.. మనదేశంలో ఈ విషయంపై భారత పార్లమెంట్లో అనేక దఫాలు చర్చకి వచ్చింది. అయితే నేడు అంతర్జాతీయంగా చర్చ రేగడంతో తెలంగాణ బిజెపి శాసనసభ్యుడు రాజా సింగ్ తో పాటుగా మరో ముగ్గురు హిందూ అతివాదులు అంతర్జాతీయ వార్త పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ మెరిసి పోయారు. తెలంగాణ బిజెపి శాసనసభ్యుడు రాజా సింగ్ తో పాటుగా మరో ముగ్గురు హిందూ అతివాదులు ఫేస్ బుక్ లో ఒక మతానికి వ్యతిరేకంగా వెదజల్లిన ద్వేషం పోస్టులన్నీ ఫేస్ బుక్ కంటెంట్ మోనిటరింగ్ టీం గమనించి, రాజాసింగ్ చేసే పోస్టులు విద్వేషాన్ని రేపేవిగా ఉన్నాయని నిర్ధారించింది. ఫేస్ బుక్ కంటెంట్ మోనిటరింగ్ టీం ప్రకారం, రాజా సింగ్ అలాగే మరో ముగ్గురు అతివాదులు ఫేస్ బుక్ అకౌంట్లు డేంజరస్ కేటగిరీలోకి వస్తాయి. అందుకే వీరి పోస్టులను డిలీట్ చేసి వీరి ఎకౌంట్లను బ్యాన్ చేయాలని నిర్ణయించింది. అయితే ఫేస్ బుక్ ఇండియా హెడ్ అంకి దాస్.. తెలంగాణ బిజెపి శాసనసభ్యుడు రాజా సింగ్ తో పాటుగా మరో ముగ్గురు హిందూ అతివాదుల ఫేస్ బుక్ ఎకౌంట్లు డిలీట్ చేయవద్దు అని ఫేస్ బుక్ యాజమాన్యానికి అప్పీల్ చేశారు. వీరి అకౌంట్స్ డిలీట్ చేస్తే ఫేస్ బుక్ వ్యాపారం భారత్ లో తగ్గిపోతుంది అని ఫేస్ బుక్ ఇండియా హెడ్ అంకి దాస్ తెలపటంతో పాటు రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటాం అని ఫేస్ స్ బుక్ కి తెలిపారు.
దాంతో తెలంగాణ బిజెపి శాసనసభ్యుడు రాజా సింగ్ తో పాటుగా మరో ముగ్గురు హిందూ అతివాదుల ఫేస్ బుక్ అకౌంట్లు యాక్టీవ్టివేట్ చేసింది. ఈ కధనం అంతర్జాతీయ వార్త పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ లో హల్చల్ చేస్తున్నది. అంతర్జాతీయ వార్త పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ వార్తా కధనం ప్రకారం, భారత దేశంలో అధికారంలో వున్నా పార్టీతో ఫేస్ బుక్ కి వున్నా స్నేహం వలన తన సొంత నియమాలను తుంగలో తొక్కింది. ఈ విషయం ఫేస్ బుక్ అధికార ప్రతినిధి ఎన్డీ స్టోన్ నిజమేనని ఒప్పుకున్నారు. ఫేస్ బుక్ ఇండియా హెడ్ అంకి దాస్..భారత్ లో అధికార పార్టీకి కోపం తెప్పించేలాగా రాజా సింగ్ తో పాటుగా మరో ముగ్గురు హిందూ అతివాదుల ఫేస్ బుక్ అకౌంట్స్ బ్యాన్ చేస్తే రాజకీయంగా ఇబ్బందులు ఎదురు అవుతాయని చెప్పారని అధికార ప్రతినిధి ఎన్డీ స్టోన్ మీడియా ముందు వెల్లడించారు. ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో అంతర్జాతీయ వార్త పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ఫేస్ బుక్ మాజీ ఉద్యోగులతో మాటాడి ఫేస్ బుక్ కి బీజేపీకి మధ్య వున్నా స్నేహం మొత్తాన్ని వెలుగులోకి తెచ్చింది. ఫేస్ బుక్ ఉద్యోగులు ఇచ్చిన సమాచారం మేరకు ఫేస్ బుక్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నది. ముస్లిం వ్యతిరేక పోస్టులు..లవ్ జిహాద్ పోస్టులను ప్రమోట్ చేయటం. ప్రభుత్వ అనుకూల గొంతులను ప్రమోట్ చేయటం.. అలాగే ప్రభుత్వ వ్యతిరేక గొంతులను అణిచివేయటం వంటివి భారత దేశంలో ఫేస్ బుక్ చేసిందని వాల్ స్ట్రీట్ జర్నల్ కధనంలో వుంది. బెంగళూర్ నాయకుడు అనంత్ కుమార్ హెగ్డేతో వాల్ స్ట్రీట్ జర్నల్ మాటాడటానికి ప్రయత్నిస్తే అతను మాటాడలేదు. అనంత్ కుమార్ హెగ్డే కరోనా ముస్లిమ్స్ వల్లే వచ్చింది అని, ••అశ్రీ% ఉద్యోగులు దేశ ద్రోహులు అని ఇష్టానుసారం మాట్లాడుతూ వుంటారు.
ఇతన్ని ఫేస్ బుక్ ప్రమోట్ చేసింది. అని వాల్ స్ట్రీట్ జర్నల్ కధనం. గమనించాల్సిన విషయం ఏమనగా అనంత కుమార్ హెగ్డే అకౌంట్ ను క్లోజ్ ట్విట్టర్ చేసింది. ఫేస్ బుక్ మాత్రం అనంత్ కుమార్ హెగ్డే అకౌంట్ కొనసాగిస్తున్నది. మరో ముఖ్యమైన విషయం ఏమనగా ఫేస్ బుక్ ఇండియా హెడ్ అంకి దాస్ చెల్లెలు జెఎన్ యు లో చదువుకున్నప్పుడు బీజేపీ విద్యార్థి సంఘం %•దీ••% ప్రెసిడెంట్ గా వుండిన రష్మీ దాస్..ఫేస్ బుక్ ముకేశ్ అంబానీ జియోలో ఇన్వెస్ట్ చేయటాన్ని స్వాగతిస్తూ మని కంట్రోల్ డాట్ కామ్ లో ఒక ఆర్టికల్ రాసారు. ఇవన్నీ విషయాలు భారత పార్లమెంట్ రాజ్యసభలో ఇదివరకే చర్చలోకి వచ్చాయి. తృణమూల్ ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్ ఫేస్ బుక్ భారత కార్యాలయం బీజేపీ ఐటీ సెల్ అయిపోయింది అని నిండు రాజ్యసభలో చెప్పారు.ఫేస్బుక్ బీజేపీ క్యాంపైన్ మేనేజర్ అని అన్నారు.. అయినా ఫేస్ బుక్ కిక్కురు మన లేదు.. ఈ విషయంపై భారత్ లో స్వతంత్ర ఇన్వెస్టిగేషన్ జరపాలి అని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.