నాగర్ కర్నూల్, మే 9.ప్రజాతంత్రవిలేకరి: తాడూర్ మండలకేంద్రంలో శనివారం యువజన కాంగ్రెస్ మండలాద్యక్షులు వడ్యాల రాఘవేందర్ రెడ్డి ఆద్వర్యంలో ఫేస్ ప్రొటెక్షన్ షీల్డస్,శానిటేజర్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా నుండి ప్రజలను కాపాడేందుకు తమ ప్రాణాలను అడ్డువేసి అహర్నిశలు పాటు పడుతున్న పోలీస్ డిపార్ట్మెంట్, పారిశుధ్య కార్మికులకు, ఆశా వర్కర్లకు, మరియు ప్రింట్ మీడియా మిత్రులకు కీ.శే వాడ్యాల వెంకట్ రెడ్డి జ్ఞాపకార్థం ఫేస్ ప్రొటెక్షన్ మాస్క్ లు, శానిటేజర్లు, పంపిణి చేయడం జరిగిందని తెలిపారు.ప్రజలు మాస్కులు లేకుండా బయటకు రావద్దని, సామాజిక దూరం పాటించాలని కోరారు.లాక్ డౌన్ పూర్తయ్యే వరకు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కోనసాగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తిరుపత య్య, మండల యూత్ కాంగ్రెస్ నాయకులు మద్దెల నాగేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు.