రేప్ కాబడిన మహిళకు న్యాయం చేయండి : టిజెఎస్ అధ్యక్షుడు ప్రొ. కోదండరామ్
పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన రేప్ కేసులో బాధిత యువతికి ప్రభుత్వం న్యాయం చేయాలని తెలంగాణ జనసమితి నేత కోదండరాం డిమాండ్ చేశారు. శుక్రవారం ఇక్కడ పర్యటించిన ఆయన డియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పలు అంశాలపై ఆయన స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మహిళా కమిషన్ను ఏర్పాటు చేయలేదని విమర్శించారు. మహిళా కషన్ను ఏర్పాటు చేసి బాధిత మహిళలకు అండగా ఉండాలని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందని కోదండరామ్ విమర్శించారు. టీఆర్ఎస్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా మిత్రపక్షాలతో కలిసి పోరాడతామని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. హాస్పిటళ్లు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించిన తరువాతే సచివాలయం వంటి నిర్మాణాలను చేపట్టాలని ప్రభుత్వానికి కోదండరామ్ సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు తన సౌకర్యాలపై ఉన్న శ్రద్ధ ప్రజా భద్రతపై లేదని దుయ్యబట్టారు.