నెల్లూరు, జూన్ 5 : ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రపంచపర్యావరణ దినోత్సవ సందర్భంగా, ఎన్ఎస్ఎస్ ఆధ్యవర్లో వి యస్ యులో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్, వెల్ఫేర్ టి బాపి రెడ్డి, ముఖ్య అతిధిగా, డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ వై కె షణ్ముఖ కుమార్, విశిష్ట అతిధులుగా పాల్గొని వి ఎస్ యు ప్రగణం ఔషధ వనంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బాపిరెడ్డి మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడే విధంగా పరిశోధనలు చేపట్టాలని కోరారు. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఎల్.విజయ క్రిష్ణ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో విశ్వవిద్యాలయం పచ్చదనంతో నిండాలని కోరారు ప్రతిఒక్కరు వారి గ్రామంలో అలాగే వారి ఇళ్లలో కూడా మొక్కలను నాటాలని అలాగే పక్షులకు ఉపయోగపడే పండ్ల మొక్కలను కూడా నాటాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ వై కె షణ్ముఖ కుమార్ మాట్లాడుతూ సామాన్య ప్రజలందరికి పర్యావరణ సమతుల్యత ద అవగాహనా కల్పించే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రజలందరూ ఏదో ఒక మొక్కను వారి వారి ఇళ్లలో నాటాలని విజ్ఞప్తి చేశారు. శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ డా. మోపూరు భాస్కర్ నాయుడు గారు, ఖర్జూరపు చెట్లను బహుకరించారు. విశ్వవిద్యాలయంలో పచ్చదనం పెంపొందిం చేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ యస్ యస్ సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం , డిస్టిక్్రయూత్ ఆఫీసర్ ఏ మహేంద్ర రెడ్డి , డా. కె సునీత ,డా ఆర్. మధుమతి,డా సిచ్. కిరణ్మయి అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా విశ్వవిద్యాలయ విద్యార్థిని విద్యార్థులకు బోధనా బోధనేతర సిబ్బందికి కార్యక్రమ నిర్వాహకులకు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి బి రాజశేఖర్ శుభాకాంక్షలు తేలిజేశారు.