Take a fresh look at your lifestyle.

విశాఖ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ ఆరుగురు మావోయిస్టుల హతం

విశాఖలో బుధవారం తెల్లవారుజామున గ్రేహౌండ్స్ ‌దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోలు మతమయ్యారు. సంఘటనపై కొయ్యూరు సిఐ వెంకటరమణ మాట్లాడుతూ…‘విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం మంప పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని తీగలమెట్ట వద్ద మావోయిస్టులు ఉన్నారన్న సమచారం అందుకున్న మంప పిఎస్‌ ‌పరిధిలోని పోలీసులు అక్కడ కూంబింగ్‌ ‌చేపట్టారు. బుధవారం తెల్లవారుజామున ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తున్నది. ఎవరు చనిపోయారు.. ఎంత మంది గాయపడ్డారో తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.

దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో వివరాలు తెలియడానికి సమయం పడుతుంది’ అని తెలిపారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో వివరాలు తెలియడానికి సమయం పడుతుందని వివరించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో కూంబింగ్‌ ‌కొనసాగుతున్నదని చెప్పారు. ఘటనాస్థలికి అదనపు బలగాలను తరలిస్తున్నామన్నారు. ఘటనాస్థలిలో ఎకె-47, తుపాకులు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. మావోయిస్టు అగ్ర నేతలు తప్పించుకున్నారన్న సమాచారంతో హెలికాప్టర్‌ ‌సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.

Leave a Reply