*ఇద్దరు మావోయిస్టుల మృతి
కొద్ది రోజుల క్రితం టీఆర్ఎస్ నేత భీమేశ్వరరావును మావోయిస్టులు దారుణంగా హత్య చేసిన తర్వాత.. వారి కోసం పోలీసులు
కూంబింగ్ చేస్తూనే ఉన్నారు. ఆదివారం ములుగు జిల్లా మంగపేట మండలం రామచంద్రునిపేట సమీప అడవుల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారాని సమాచారం.. దీంతోఆత్మరక్షణ కోసం ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారని పోలీసు వర్గాల సమాచారం.. ఈ కాల్పుల్లో లో ఇద్దరు
మావోయిస్టులు మృతి చెందారు. ఈ విషయాన్ని ఏటూరునాగారం ఏఎస్పీ సాయిచైతన్య అధికారికంగా ప్రకటించారు.