Take a fresh look at your lifestyle.

హైదరాబాద్‌ ‌రాజధాని షాన్‌ ‌పెంచేలా కృషి చేయాలి

  • కలసికట్టుగా అంతా నగరాభివృద్దికి పాటుపడాలి
  • మంచి భవిష్యత్‌ ఉన్న నగరం మన హైదరాబాద్‌
  • ‌డంబాచారాలకు పోకుండా ప్రజలను అక్కున చేర్చుకోవాలి
  • ఎందరో అర్హులున్నా ..ఒక్కరికే మేయర్‌ ‌పదవి వస్తుంది
  • ప్రగతిభవన్ లో ‌కార్పోరేటర్లతో సిఎం కెసిఆర్‌ ‌భేటీ

హైదరాబాద్‌ ‌నగర వైభవాన్ని మరింత పెంచే విధంగా కొత్తగా ఎన్నికైన మేయర్‌, ‌డిప్యూటీ మేయర్‌, ‌కార్పొరేటర్లు పాటుపడాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌పిలుపునిచ్చారు. విభిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు నివాసముంటున్న హైదరాబాద్‌ ‌నగరం అసలు సిసలైన విశ్వనగరంగా, మినీ ఇండియాగా భాసిల్లుతున్నదని అన్నారు. దీని వైభవం మరింత ఇనుమడించేలా అంతా కృషి చేయాలన్నారు. కొత్తగా ఎన్నికైన జీహెచ్‌ఎం‌సీ మేయర్‌ ‌గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ ‌మోతె శ్రీలతా రెడ్డి, టీఆర్‌ఎస్‌ ‌కార్పొరేటర్లు గురువారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వారిని అభినందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కార్పొరేటర్లకు కర్తవ్యబోధ చేశారు. హైదరాబాద్‌ ‌నగరానికి అనేక అనుకూలతలున్నాయి. మంచి భవిష్యత్‌ ఉన్నది. నిజమైన విశ్వనగరమిది. బయటి రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ స్థిరపడిన అనేక మంది ఉన్నారు. నగరంలో సింథ్‌ ‌కాలనీ, గుజరాతీ గల్లీ, పార్సీగుట్ట, బెంగాలీలు, మలయాళీలు, మార్వాడీలు, ఖాయస్తులున్నారు. ఇలా విభిన్న ప్రాంతాల వారు, విభిన్న మతాల వారు,

విభిన్న సంస్కృతుల వారున్నారు. వారంతా హైదరాబాదీలుగా గర్విస్తున్నారు. హైదరాబాద్‌ ఓ ‌మినీ ఇండియా లాగా ఉంటుంది. అందరినీ ఆదరించే ప్రేమగల్ల నగరం. ఇంత గొప్ప నగరం భవిష్యత్తు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల వి•ద ఉన్నది. వి•రు గొప్పగా పనిచేసి ఈ నగర వైభవాన్ని పెంచాలి. అన్ని వర్గాల ప్రజలను ఆదరించాలి. ప్రభుత్వం కూడా హైదరాబాద్‌ ‌నగరాన్ని అభివృద్ది చేయడానికి అనేక కార్యక్రమాలు చేపడుతుంది. వాటికి సహకరించాలని పేర్కొన్నారు. కోట్లాది మందిలో కేవలం కొద్ది మందికి మాత్రమే సందర్భం కలిసి వచ్చి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం వస్తుంది. అది గొప్ప విషయం కాదు. ప్రజాప్రతినిధిగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజా జీవితంలో మంచి పేరు తెచ్చుకోవడం గొప్ప విషయం అన్నారు. మంచిగ ఉంటేనే బట్టకాల్చి వి•దేసే రోజులివి. కొద్దిగా అవకాశం ఇస్తే చాలా చెడ్డపేరు వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. పదవిలో ఉన్న వారు ఎంతో సంయమనంతో, సహనంతో, సాదాసీదాగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో సహజత్వం కోల్పోవద్దు. వేష, భాషల్లో మార్పులు రావద్దు.

అసంబద్ధంగా, అవసరం లేని మాటలు మాట్లాడితే వచ్చే లాభమేవి• లేకపోగా కొన్ని సందర్భాల్లో వికటించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. వి• దగ్గరికి వచ్చే వాళ్ల కులం, మతం చూడవద్దు. ప్రతీ ఒక్కరిని ఆదరించాలి. అక్కున చేర్చుకోవాలి. వారికి సరైన గౌరవం ఇవ్వాలి. వారు చెప్పేది ఓపిగ్గా వినాలి. చేతనయినంత సాయం చేయాలి. అబద్దాలు చెప్పవద్దు. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలన్నారు. గల్లీ చిన్నది గరీబోళ్ల కథ పెద్దది అనే గోరటి వెంకన్న పాట వినండి. నేను వందసార్లు విన్నా. అందులో బస్తీల్లో ఉండే పేదల కష్టాలు, గోసలున్నాయి. వాటిని అర్థం చేసుకోవాలి. మేయర్‌, ‌కార్పొరేటర్లు బస్తీల్లో పర్యటించాలి. వారి బాధలు అర్థం చేసుకోవాలి. పేదలను ఆదరించాలి.

బస్తీ సమస్యలు తీర్చాలి. అదే ప్రధాన లక్ష్యం కావాలని చెప్పారు. అందరినీ ఆదరించే ప్రేమగల్ల నగరం హైదరాబాద్‌ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఎంతోమంది కార్పొరేటర్లున్నా… కానీ ఒక్కరికే మేయర్‌గా అవకాశం దక్కుతుంది. వి•లో మేయర్‌ ‌కావాల్సిన అర్హతలున్న వారు చాలా మంది ఉన్నారు. కానీ అందరికీ ఇవ్వలేము. నా పరిస్థితుల్లో వి•రున్నా అంతే చేయగలరు. అర్థం చేసుకుని, అందరూ కలిసికట్టుగా ఈ నగరాన్ని ముందుకు తీసుకుపోవాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవ రావు, రాజ్యసభ సభ్యులు సురేష్‌ ‌రెడ్డి, సంతోష్‌ ‌కుమార్‌, ‌మంత్రులు తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌, ‌మహమూద్‌ అలీ, ఇంద్రకరణ్‌ ‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ ‌పద్మారావు గౌడ్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply