బద్దెనపల్లి టెక్స్టైల్ పార్కులో అభివృద్ధ్ది పనులు ప్రారంభించిన మంత్రి కెటిఆర్
: చేనేతకు ఇబ్బంది లేకుండా, కార్మికులకు చేతినిండా పని కల్పించడమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలను తీసుకుంటున్నామని పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. చేనేతకు మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు. సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం బ్దదెనపల్లి లోని టెక్స్టైల్స్ పార్క్లో పలు అభివృద్ది పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సెంట్రల్ లైటింగ్, పరిపాలన భవనం, కార్మికుల భోజశాల, కుట్టు శిక్షణ కేంద్రాలను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు. దేశంలోనే అతిపెద్ద కాకతీయ టెక్స్టైల్స్ పార్క్ వరంగల్, సిరిసిల్లలో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నేతన్నలకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం తరపున పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇస్తున్నట్లు తెలిపారు. తంగళ్లపల్లి మండలం బ్దదెనపల్లి టెక్స్ టైల్ పార్క్లో 14కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
పార్క్లో డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ను ప్రారంభించారు. అడ్మినిస్టేష్రన్ కార్యాలయంతో పాటుగా కార్మికుల భోజనశాల, కుట్టుశిక్షణ కేంద్రాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. చేనేతకు 50 శాతం సబ్సీడి ఇస్తున్నామని,ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్ వారి కోసం పని చేస్తున్నారని మంత్రి తెలిపారు. రూ.14.50 కోట్ల తో టెక్స్ టైల్ పార్కులో అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. కరోనా నేపథ్యంలో కార్మికులకు అండగా ఉంటామన్నారు. కంపెనీల యజమానులు కార్మికుల శ్రేయస్సుకు పాటుపడాలన్నారు. చేనేతల కార్మికులకు ప్రభుత్వ పరంగా చేయుతను అందిస్తామన్నారు. కేంద్రం సాయం కోరుతూ కేంద్ర మంత్రి స్మ•తి ఇరానీకి లేఖ రాసినట్లు మంత్రి తెలిపారు.సిరిసిల్ల నేత కళాకారుల నైపుణ్యం ప్రపంచానికి తెలియ జేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. ఈ సందర్బంగా ఓ వ్యక్తి పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి నిరసన తెలిపాడు. విద్యుత్ సబ్సిడీ రాలేదని.. తంగళ్ళపల్లి మండలానికి చెందిన నరహరి అనే వ్యక్తి నిరసన తెలిపాడు. కార్యక్రమంలో స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.