తెలకపల్లి, ఏప్రిల్ 28, (ప్రజాతంత్ర విలేకరి) : రైతుల నుంచి వరి కొనుగోలు లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని నాగర్ కర్నూలు జిల్లా డిఆర్ఓ మధుసూదన్ నాయక్ అన్నారు మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు కరోనా మహమ్మారి నిర్మూలన పై అవగాహన అవసరమని వరి కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులకు సామాజిక దూరం పాటించేలా అవగాహన కల్పించాలని అన్నారు.
వరి కొనుగోలు తేమశాతం మండలంలోని 18 వరి కొనుగోలు సెంటర్ల వివరాలు తలెత్తే సమస్యలు ఇప్పటివరకు ఎంత కొనుగోలు చేశారు స్టాకు మొదలైన విషయాలను అడిగి తెలుసుకు న్నారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ఎం శ్రీనివాసులు సింగిల్ విండో చైర్మన్ డి భాస్కర్ రెడ్డి, సీఈవో ధర్మవీర్ డిఆర్ఓ సి సి శివ కుమార్ పిఎసిఎస్ సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు.