సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మంగళవారం హైడ్రామా చోటుచేసుకుంది. కరోనా పేరిట తనను బలిపశువుని చేస్తున్నారంటూ డాక్టర్ వసంత్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. పెట్రోల్ బాటిల్తో ఆసుపత్రికి వచ్చిన డాక్టర్ వసంత్ సూసైడ్కు యత్నించడంతో ఆసుప్రతి వర్గాలు ఉలిక్కి పడ్డాయి.ఇది చూసి అసలేం జరుగుతుందో తెలియక రోగులు, వారి బంధువులు కంగారుకు గురయ్యారు. ఈ దశలో పోలీసులు చాకచక్యంగా ప్రయత్నించి ఆయనను అదుపులోకి తీసుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులున్నాయంటూ తాను ప్రచారం చేశానని నిందమోపి తనపై చర్య తీసుకున్నారని, నిజానికి తాను అలాంటి ప్రచారం చేయలేదని అనవసరంగా తనను బలిపశువును చేశారని డాక్టర్ వసంత్ అన్నారు. తన వాదనను ఎవరు పట్టించుకోకపోవడంతో తాను ఆత్మహత్య చేసుకుంటానని డాక్టర్ వసంత్ గాంధీ ఆసుపత్రి ఆవరణలో హల్చల్ చేశాడు. మామూలుగా విధులకు హాజరయ్యేందుకు వచ్చిన వసంత్.. షర్ట్లో పెట్రోలో బాటిల్ వెంట తెచ్చుకున్నాడు. హల్చల్ చేస్తున్న డాక్టర్ వసంత్ని చూసి అక్కడే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకునేందుకు యత్నించారు. అయితే తన వద్దకు ఎవరూ రావద్దని, వస్తే ఆత్మహత్యచేసుకుంటానని ఆయన హెచ్చరించాడు. అదే సమయంలో వచ్చిన పోలీసులు అతన్ని పట్టుకునేందుకు యత్నించగా ఆయన తప్పించుకుని పరుగెత్తాడు. ఎట్టకేలకు పోలీసులు ఆయనను అతన్ని అదుపులోకి తీసుకుని, పెట్రోల్ బాటిల్ని అతన్నుంచి లాక్కోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. తనపై అనవసర ఆరోపణలు రావడంతోనే మనస్తాపంతో అత్మహత్య చేసుకుందామని అనుకున్నట్లు డాక్టర్ వసంత్ చెబుతున్నారు. ’కరోనా వైరస్’ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ రోజురోజుకూ దేశాలను దాటేస్తూ వ్యాప్తి చెందుతోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంది. అయితే..
హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో చేరిన కొందరికి కరోనా వైరస్ ఉందని పలువురు డాక్టర్లు హడావుడి చేశారు. దీంతో కొందరు వైద్యులపై ఆస్పత్రి ఉన్నతాధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకున్నారు. దీంతో మంగళవారం ఆస్పత్రికి వచ్చిన డాక్టర్ వసంత్ ఈ అఘాయిత్యం చేశారు.గాంధీ ఆస్పత్రి యాజమాన్యం నిరంకుశంగా ప్రవర్తిస్తున్నారు. నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. నన్ను గాంధీలో నుంచి పంపించేందుకు కుట్ర పన్నారు. కరోనా పాజిటివ్ లీకేజీల పేరుతో నన్ను బదిలిచేశారు. వ్యతిరేకంగా మాట్లాడితే మాపై చర్యలు తీసుకుంటున్నారు. డాక్టర్ తిట్టాడంటూ పదిమందితో సంతకాలు చేయించి చర్యలు తీసుకున్నారు. ప్రాణాలు పోసే డాక్టర్కే అన్యాయం జరుగుతోంది. నేను ఎలాంటి తప్పు చేయలేదు.. సూపరింటెండెంట్ సమాధానం చెప్పాలని వసంత్ డిమాండ్ చేశారు.