మండలంలోని యశ్వంతా పూర్ గ్రామ సమీపంలో గురువారం రాత్రి బైక్పై వస్తుండగా డీసీఎం ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన చోటు చేసు కుంది. వివరాల్లోకి వెళితే రఘునాథపల్లి ఖిలాషాపురం గ్రామానికి చెందిన పల్లపు లక్ష్మి, భర్త సత్యనారాయణలు ఇరువురు కలిసి హైధరాబాద్ నుంచి ఖిలాషాపూర్కు వెళ్తున్న తరుణంలో యశ్వంతాపురం వద్ద అతివేగంగా హన్మకొండ నుంచి జనగామ వైపు వస్తున్న డీసీఎం ఢీకొట్టడంతో లక్ష్మి మృతిచెందింది.
సత్యనారాయణకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, ఆర్థిక సహాయం అందించాలని మృతురాలి బంధువులు జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు. నిందితునిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఐ మల్లేష్ యాదవ్ మృతురాలి బంధువులకు నచ్చజెప్పి ధర్నాను విరమింపచేశారు.