Take a fresh look at your lifestyle.

మీ అమ్మతనానికి వందనం తుని మహిళకు డిజిపి వీడియో కాల్‌

కరోనా వైరస్‌ ‌లాక్‌డౌన్‌ ‌నేపథ్యంలో విధులు నిర్వహిస్తోన్న పోలీసులకు తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణానికి చెందిన ఓ మహిళ కూల్‌‌డ్రింక్‌ అం‌దించిన వీడియో సోషల్‌ ‌డియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ డీజీపీ గౌతమ్‌ ‌సవాంగ్‌ ‌స్పందించారు. ఆమె వివరాలు తెలుసుకున్న గౌతమ్‌.. ‌వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా నేరుగా ఆమెతో మాట్లాడారు. అమ్మతనానికి మేమంతా చలించిపోయాం. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై రు చూపిన ప్రేమకు మేమంతా సెల్యూట్‌ ‌చేస్తున్నాం అని కృతఙ్ఞతలు తెలిపారు.

కాగా దినసరి కూలీగా చేస్తోన్న ఆ మహిళ పోలీసుల కోసం కూల్‌‌డ్రింక్స్ ‌తీసుకొచ్చి అందివ్వగా.. దాన్ని వారు సున్నితంగా తిరస్కరించడంతో పాటు పిల్లలకు ఇవ్వండి అంటూ తమ దగ్గర ఉన్న కూల్‌‌డ్రింక్స్‌ను ఇచ్చారు. అంతేకాకుండా ఆమెతో అమ్మా.. వీలైతే రోజు ఒకసారి వచ్చి మాకు కనిపించండి. మాకు ధైర్యంగా ఉంటుంది అని పోలీసులు ఆ వీడియోలో చెప్పారు. ఇక ఈ వీడియో వైరల్‌గా మారగా.. సర్వత్రా ఆ మహిళపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నటుడు మాధవన్‌ ‌సైతం ఈ వీడియోను తన సోషల్‌ ‌డియాలో షేర్‌ ‌చేయడం గమనర్హం.

Leave a Reply