కొత్తగా 3801 మందికి పాజిటివ్..ఒక్కరు మృతి
ప్రజాతంత్ర, హైదరాబాద్, జనవరి 26 : రాష్ట్రంలో రోజువారీ కొరోనా కేసులు క్రితం రోజుకన్నా తగ్గాయి. బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 3801 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం తాజాగా 3801 కొరోనా కేసులు నమోదు కాగా..వైరస్ కారణంగా ఒక్కరు మృతి చెందారు.
జిహెచ్ఎంసి పరిధిలో కొత్తగా 1570 కేసులు నమోదవగా, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 254, రంగారెడ్డి జిల్లాలో 284 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 7,47,155 కాగా, మొత్తం మృతుల సంఖ్య 4,078కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 7,05,054 కాగా యాక్టివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగి 38,023గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది