కొత్తగా 512 మందికి పాజిటివ్…ఒక్కరు మృతి
ప్రజాతంత్ర, హైదరాబాద్, ఫిబ్రవరి 16 : రాష్ట్రంలో రోజువారీ కొరోనా కేసులు క్రితం రోజుకన్నా తగ్గాయి. బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 512 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం తాజాగా 512 కొరోనా కేసులు నమోదు కాగా..చాలా కాలం తర్వాత వైరస్ కారణంగా ఒక్కరు మృత్యువాత పడ్డారు.
ఇక జిహెచ్ఎంసి పరిధిలో కొత్తగా 125 కేసులు నమోదవగా, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 39 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 35 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 7,85,143 కాగా, మొత్తం మృతుల సంఖ్య 4,108గా ఉంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 7,73,362 కాగా యాక్టివ్ కేసుల సంఖ్య మరింత తగ్గి 7,673గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది.