తాజాగా 15,981 మందికి పాజిటివ్..166 మంది మృతి
దేశంలో రోజువాకీ కొరోనా కొత్త కేసులు తగ్గాయి. తాజాగా 24 గంటల్లో కొత్తగా 15,981 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే క్రితం సారితో పోలిస్తే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గి 18 వేలకు దిగువన కేసులు నమోదు అయ్యాయి. శుక్రవారం 17,861 మంది కొరోనా నుంచి కోలుకోగా, 166 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 3,40,53,573 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 2,01,632 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
ఇప్పటి వరకు కొరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 3,33,99,961. కాగా కోవిడ్ మరణాల మొత్తం సంఖ్య 4,51,980కు చేరింది. కేరళలో శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 8,867 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 67 మంది మరణించారు. గత 24 గంటల్లో 8,36,118 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకు మొత్తంగా 97,23,77,045 మందికి టీకా డోసులు వేశారు.