ఎయిరిండియా విమానాల్లో తరలింపు
దిగ్గజ ఔషధ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా తొలి విడత డోసులు బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు 11 విమానాల్లో బయల్దేరాయి. ఇప్పటికే టీకా దిల్లీ, ముంబయి చేరుకుంది. 55 లక్షల కొవాగ్జిన్ డోసులు నేటికల్లా వివిధ రాష్ట్రాలకు చేరనున్నాయి. దిల్లీ, ఆంధప్రదేశ్, అసోం, ఒడిశా, తమిళనాడు, బిహార్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లకు టీకా డోసులు తరలించనున్నారు. ఎయిరిండియా విమానం ఏఐ599 విమానంలో బుధవారం ఉదయం 6.40 గంటలకు రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన కొవాగ్జిన్ టీకా డోసులు 9 గంటలకు దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరాయి. ఈ మేరకు విమానాశ్రయ అధికారులు తెలిపారు. అనంతరం టీకాలను భద్రపరచేందుకు రాజీవ్గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (ఆర్జీఎస్ఎస్హెచ్)కు తరలించనున్నారు. వీటిలో 38.5 లక్షల డోసులను కేంద్రం కొనుగోలు చేయగా 16.5 లక్షల డోసులను భారత్ బయోటెక్ ప్రభుత్వానికి ఉచితంగా అందిస్తోంది.
దిగ్గజ ఔషధ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా తొలి విడత డోసులు బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు 11 విమానాల్లో బయల్దేరాయి. ఇప్పటికే టీకా దిల్లీ, ముంబయి చేరుకుంది. 55 లక్షల కొవాగ్జిన్ డోసులు నేటికల్లా వివిధ రాష్ట్రాలకు చేరనున్నాయి. దిల్లీ, ఆంధప్రదేశ్, అసోం, ఒడిశా, తమిళనాడు, బిహార్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లకు టీకా డోసులు తరలించనున్నారు. ఎయిరిండియా విమానం ఏఐ599 విమానంలో బుధవారం ఉదయం 6.40 గంటలకు రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన కొవాగ్జిన్ టీకా డోసులు 9 గంటలకు దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరాయి. ఈ మేరకు విమానాశ్రయ అధికారులు తెలిపారు. అనంతరం టీకాలను భద్రపరచేందుకు రాజీవ్గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (ఆర్జీఎస్ఎస్హెచ్)కు తరలించనున్నారు. వీటిలో 38.5 లక్షల డోసులను కేంద్రం కొనుగోలు చేయగా 16.5 లక్షల డోసులను భారత్ బయోటెక్ ప్రభుత్వానికి ఉచితంగా అందిస్తోంది.
కొవాగ్జిన్ టీకాలు సుమారు ఒంటిగంట ప్రాంతంలో ఆస్పత్రికి చేరనున్నాయి. వచ్చిన టీకాల నుంచి మేము 20వేల డోసులు తీసుకుంటున్నట్లు ప్రభుత్వానికి వెల్లడించామని ఆస్పత్రి డైరక్టర్ బీఎల్ షేర్వాల్ తెలిపారు. మొదటి దశలో భాగంగా 55లక్షల వ్యాక్సిన్లను పంపే లక్ష్యంతో ఉన్నామని భారత్ బయోటెక్ తెలిపింది. మంగళవారం ఆర్జీఎస్ఎస్హెచ్ 2.64 లక్షల కొవిషీల్డ్ టీకాలను సేకరించి, భద్ర పరచింది. సీరం ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన 22 బాక్సుల్లో కొవిషీల్డ్ వ్యాక్సిన్ను సేకరించామని ఆస్పత్రి అధికార ప్రతినిధి వెల్లడించారు. భారత్లో అభివృద్ధి చేసిన కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు అత్యవసర వినియోగ అనుమతిని పొందాయి. వీటి వల్ల ఎటువంటి దుష్పభ్రావాలు ఎదురవ్వవని నీతీ ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఒక సమావేశంలో తెలిపారు. భారత్లో కొవిడ్ వ్యాక్సినేషన్ పక్రియను జనవరి 16నుంచి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్భూషణ్ తెలిపారు.