ఇంట్లోనే ఐసోలేషన్కు వెళ్లిన భాస్కర్రావు
తెలంగాణలో ప్రజాప్రతినిధులను కరోనా భయం వెంటాడుతోంది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కోవిడ్ కంగారు పెడుతోంది. వరుసగా వారు కొరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కొరోనా సోకగా తాజాగా మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు సైతం వైరస్ బారినపడ్డారు. జలుబు, దగ్గు లక్షణాలు కనిపిం చడంతో రెండు రోజుల కింద ఆయన పరీక్షలు చేయించుకున్నారు. బుధవారం రిపోర్టులు వచ్చాయి. అందులో కొరోనా పాజిటివ్ రావడంతో మిర్యాలగూడలోని తమ ఇంట్లోనే ఐసోలేషన్లో ఉన్నారు.
దీంతో కొరోనా బారిన పడుతున్న రాజకీయ నేతల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే •ంమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, గణెళిష్ గుప్తా కొరోనా బారినపడ్డారు. ఇక కాంగ్రెస్ నేతలు వి.హనుమంతరావు, గూడూరు నారాయణరెడ్డి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి కొరోనా సోకిన విషయం తెలిసిందే. ఐతే వీరిలో చాలా మంది ఇప్పటికే కోలుకొని హాస్పిటళ్ల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.