న్యూ దిల్లీ, జనవరి 11 : భారత్లో కొరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,80,926 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా.. 171 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,80,386కి చేరింది.
ప్రస్తుతం దేశంలో 2,342 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 5,30,722 మంది మృతి చెందారు. ప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 0.01 కేసులు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయని వెల్లడించింది. రికవరీ రేటు 98.80 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.15 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.