టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్కు కొరోనా సోకింది. ఈ విషయాన్నిఆయనే తన ట్విట్టర్లో పోస్ట్చేశారు. ప్రస్తుతం కొరోనా లక్షణాలు ఏమీ లేవని, ఆరోగ్యంగానే ఉన్నట్టు తెలిపారు. తనకు కొరోనా సోకిన విషయం తెలిసి తన ఆరోగ్యం పట్ల ఎంతో మంది అభిమానులు, పార్టీనాయకులు తనకు ఫోన్లు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నానని, ఎవరూ ఆందోళన పడాల్సిన పనిలేదని చెప్పారు ఇటీవల తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని, ప్రతి ఒక్కరూ మాస్క్లు ధరించాలని, ఇంట్లోనే ఉండాలని కోరారు. కెసిఆర్కు కొరోనా రావడంతో ఆయనతో సన్నిహితంగా ఉన్న సంతోష్ కూడా టెస్ట్ చేయించడంతో ఈ విషయం బయటపడిందని సమాచారం.