Take a fresh look at your lifestyle.

సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌కు కొరోనా పాజిటివ్‌

‌రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు కొరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. తనకు కోవిడ్‌ ‌సోకినట్లు సీఎస్‌ ‌స్వయంగా వెల్లడించారు. అయితే ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం అందలేదు. ఉదయమే కొరోనా నియంత్రణపై కలెక్టర్లతో సోమేష్‌కుమార్‌ ‌వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు.

సోమేష్‌కుమార్‌  ‌సోమవారం సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఇటీవల ఆయన టీకా ఫస్ట్ ‌డోస్‌ ‌తీసుకున్నారు. ప్రతీ రోజు సీఎంతో సోమేష్‌కుమార్‌ ‌సమిక్షల్లో పాల్గొంటున్నారు. అయితే ఇటీవల తనను కలిసిన వారిలో ఎవరికైనా లక్షణలు కనిపిస్తే వెంటనే  కోవిడ్‌ ‌టెస్ట్ ‌చేయించుకోవాలని సోమేశ్‌కుమార్‌ ‌సూచించారు.

Leave a Reply