24 గంటల్లో కొత్తగా 746 మందికి పాజిటివ్..ఐదుగురు మృతి
రాష్ట్రంలో కొరోనా కొత్త కేసులు పెరిగాయి. సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 746 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, వైరస్ నుంచి 729 మంది కోలుకున్నారు. వైరస్ కారణంగా ఐదుగురు మృతి చెందారు.
జిహెచ్ఎంసి పరిధిలో కొత్తగా 71 కేసులు నమోదవగా, ఖమ్మం జిల్లాలో 61 కేసులు, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలలో 57 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,37,373 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,764కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,23,773 కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 9,836గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది.