24 గంటల్లో కొత్తగా 638 మందికి పాజిటివ్..ముగ్గురు మృతి
రాష్ట్రంలో రోజువారి కొరోనా కొత్త కేసులు పెరిగాయి. ఆదివారం కొత్తగా 494 కేసులు నమోదు కాగా సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 638 నమోదయ్యాయి. కాగా వైరస్ నుంచి 715 మంది కోలుకున్నారు. వైరస్ కారణంగా ముగ్గ్దురు మృతి చెందారు. వరంగల్ అర్బన్ జిల్లాలో కొత్తగా 66 కేసులు నమోదవగా, కరీంనగర్ జిల్లాలో 65 కేసులు, ఖమ్మం జిల్లాలో 62 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,41,791 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,787కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,28,679 కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 9,325గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది.