24 గంటల్లో కొత్తగా 239 మందికి పాజిటివ్..ఇద్దరు మృతి
రాష్ట్రంలో రోజువారీ కొరోనా కొత్త కేసులు నిలకడగా ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 239 కేసులు నమోదయ్యాయి. కాగా వైరస్ నుంచి 336 మంది కోలుకున్నారు. వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందారు. జిహెచ్ఎంసి పరిధిలో కొత్తగా 68 కేసులు నమోదవగా, కరీంనగర్ జిల్లాలో 17 కేసులు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలలో 16 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,64,650 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,911కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,55,961 కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 4,778గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది.