24 గంటల్లో 848 మందికి పాజిటివ్..6 గురు మృతి
రాష్ట్రంలో శనివారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొరోనా కొత్త కేసులు ముందు రోజు లాగే నిలకడగా ఉన్నాయి. 24 గంటల్లో కొత్తగా 848 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, వైరస్ నుంచి 1114 మంది కోలుకున్నారు. వైరస్ కారణంగా 6 గురు మృతి చెందారు.
జిహెచ్ఎంసి పరిధిలో కొత్తగా 98 కేసులు నమోదవగా, నల్లగొండ జిల్లాలో 66 కేసులు, సూర్యాపేట జిల్లాలో 58 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,26,085 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,684కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,09,947 కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 12,454గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది.