24 గంటల్లో కొత్తగా 482 మందికి పాజిటివ్..ఇద్దరు మృతి
రాష్ట్రంలో రోజువారి కొరోనా కొత్త కేసులు నిలకడగా ఉన్నాయి. బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 482 కేసులు నమోదయ్యాయి. కాగా వైరస్ నుంచి 455 మంది కోలుకున్నారు. వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందారు.
జిహెచ్ఎంసి పరిధిలో కొత్తగా 82 కేసులు నమోదవగా, కరీంనగర్ జిల్లాలో 61 కేసులు, వరంగల్ అర్బన్ జిల్లాలో 41 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,50,835 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,833కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,38,865 కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 8,137గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది.