- అవగాహన పెంచేలా గ్రీన్ క్లస్టర్లలో కార్యకలాపాలు
- రైతు భరోసా, మత్స్యకార భరోసాపైనా సక్ష
- గుజరాత్లో చిక్కుకున్న మత్స్యకారులపై దృష్టి
- అధికారులతో సక్షలో సిఎం వైఎస్ జగన్
కరోనా నియంత్రణ చర్యలు, కట్టడిని మరింత పటిష్టం చేయాలని సిఎం వైఎస్ జగన్ ఆదేశించారు. వివిధ జిల్లాల్లో తీసుకుంటున్న చర్యలపై ఆరా తీసారు. కోవిడ్-19 నివారణా చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా విస్తరణ, పరీక్షల వివరాలను అధికారులు సీఎంకు తెలిపారు. కరోనా సోకిన రోగికి నిరంతరం ఆక్సిజన్ లెవల్స్పై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని అధికారులు తెలిపారు. కరోనా రోగులకు పల్స్ ఆక్సీ టర్లు పెడుతున్నామని అన్నారు. మరిన్ని పల్స్ఆక్సీ టర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని వెల్లడించారు. ప్రతి 6 గంటలకోసారి ఆక్సిజన్ లెవల్ చెక్ చేస్తున్నామని సీఎంకు వెల్లడించారు. వీలైనన్ని బెడ్లకు ఆక్సిజన్ సరఫరా అయ్యేలా చూసుకోవాలని సీఎం సూచించారు.ఇప్పటివరకు 41,512 మందికి పరీక్షలు చేసినట్టుగా వెల్లడించారు. ప్రతి పదిలక్షల జనాభాకు 830 మందికి పరీక్షలు చేసి.. ఆంధప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. 809 పరీక్షలతో రాజస్థాన్ రెండో స్థానంలో నిలిచింది. ట్రూనాట్ పరీక్షల నమోదుకు ఐసీఎంఆర్ అనుమతులు ఇచ్చిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 5,757 పరీక్షలు చేసినట్టు వివరించారు. ర్యాపిడ్ టెస్టు కిట్లపైన సమావేశంలో చర్చ జరిగింది. ఏపీకి రాజస్థాన్ తరహా చైనా కిట్లను విక్రయించేందుకు.. సంబంధిత వ్యక్తులు ముందుకొచ్చారని అధికారులు తెలిపారు. కొరియా నుంచి నాణ్యమైన ర్యాపిడ్ టెస్టు కిట్లను తెప్పించామని పేర్కొన్నారు. అమెరికాకు వెళ్లాల్సిన కిట్లను చార్టర్ విమానం ద్వారా తెప్పించుకున్నామని వెల్లడించారు. ఇప్పటికి 5 నుంచి 6 వేల శాంపిళ్లను పరిశీలించామని అన్నారు. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు మంచి పనితీరు కనబరుస్తున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. కరోనా రోగులకు వివిధ దేశాల్లో అనుసరిస్తున్న వైద్య విధానాలపై నిరంతర అధ్యయనం చేస్తున్నామన్నారు. ప్రతి రోగికీ కేస్ షీట్ తయారుచేస్తున్నామని.. కరోనా బాధితునికి వైద్య విధానంపై స్టాండర్డ్ ప్రోటోకాల్ అనుసరిస్తున్నామని అధికారులు తెలిపారు. రాష్ట్రస్థాయిలో కరోనా ఆస్పత్రులే కాకుండా జిల్లాల్లో గుర్తించిన ఆస్పత్రులతో.. కలిపి 18 ఆస్పత్రుల్లో ప్రోటోకాల్ అమలయ్యేలా చూస్తున్నామని తెలిపారు. వైద్యులకు తగిన శిక్షణ ఇస్తున్నామని అన్నారు. ప్రతి కరోనా ఆస్పత్రిలో వైరస్ లక్షణాలు ఉన్నవారికి వైరస్ నిర్దారణ కోసం ఒక ట్రూనాట్ మిషన్ను పెడుతున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. సచివాలయంలో జరిగిన ఈ సక్షా సమావేశానికి మంత్రులు బొత్సాసత్యన్నారాయణ, కన్న బాబు సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి హాజరయ్యారు.
రైతుభరోసా, మత్స్యకార భరోసాలపై సమీక్ష:
లబ్దిదారుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో 2 వారాలపాటు ప్రదర్శించాలని సీఎం స్పష్టం చేశారు. తర్వాత గ్రీవెన్స్ కోసం కనీసం వారంరోజుల సమయం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఆక్వా ఉత్పత్తులను నిల్వచేయడానికి కోల్డ్స్టోరేజీలపై దృష్టిపెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు. ఫాంగేట్ వద్దే పంట కొనుగోలు పద్ధతిని సమర్థవంతగా అమలు చేయాలని చెప్పారు. కూపన్ విధానం ఏ రకంగా పనిచేస్తుందో పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామ సచివాలయాల్లోని అగ్రికల్చర్ అసిస్టెంట్లను వినియోగించుకోవాలని సీఎం సూచించారు. ఆయిల్పాం ధర తగ్గుదలపై దృష్టిపెట్టాలని సీఎం చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు నష్టం రాకూడదని అన్నారు. పక్క రాష్ట్రంలో ఉన్న రేటుకన్నా.. తక్కువకు కొనే పరిస్థితి ఉండకూడదన్న సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. వచ్చిన సడలింపులు మేరకు కార్యకలాపాలు ప్రారంభించిన రంగాల్లో కరోనా వైరస్ నివారణా చర్యలపై అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. దీనివల్ల కార్యకలాపాలు సజావుగా సాగడానికి అవకాశాలు ఉంటాయని
చెప్పారు. రెడ్, ఆరెంజ్ క్లస్టర్లలో నిర్దేశిరచుకున్న నిబంధనలను పాటించాలని అన్నారు. గ్రీన్ క్లస్టర్లలో మాత్రం సడలించిన నిబంధనలమేరకు కార్యకలాపాలు కొనసాగేలా చూడాలని సీఎం ఆదేశించారు. గ్రీన్ క్లస్టర్లలోని పరిశ్రమలు, అగ్రి ప్రాసెసింగ్ యూనిట్లు, వ్యవసాయ కార్యకలాపాల్లో భౌతిక దూరం పాటించి ఆమేరకు ఆయా కార్యకలాపాలు ముందుకు సాగేలా చూడాలని సీఎం అన్నారు.
గుజరాత్లో తెలుగు మత్స్యకారుల బాగోగులపై దృష్టి:
గుజరాత్లో తెలుగు మత్స్యకారుల అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. వారికి తగిన సదుపాయాలు, ఆహారం అందించాల్సిందిగా గుజరాత్ సీఎంకు ఫోన్ చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ అధికారులతో కూడా మాట్లాడమని అన్నారు. మత్స్యకారులకు వసతి, భోజనం విషయంలో అక్కడి ప్రభుత్వం కొన్ని రకాల చర్యలు తీసుకుందని అధికారులు తెలిపారు. మత్స్యకారులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వారికి తగిన వసతి, సదుపాయాలు అందేలా చూడాలంటూ సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా గుజరాత్లో చిక్యుకుపోయిన మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అక్కడున్న సుమారు 6వేల మంది మత్స్యకారులకు ఈ డబ్బు అందజేయాలని అన్నారు. ఈమేరకు గుజరాత్ అధికారులతో కలిసి సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు.