తీవ్రస్థాయికి చేరిన వైరస్ వ్యాప్తి
అగ్రరాజ్యం అమెరికాలో ఆగని కొరోనా విలయం
ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. వైరస్ బాధితుల సంఖ్య 93 లక్షలు దాటిందంటే.. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అటు మరణాల సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది. ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది. బ్రెజిల్లో పరిస్థితి దారుణంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 93,54,861 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 4,79,878 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి చికిత్స పొంది 50,46,241 మంది కోలుకున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. న్యూజెర్సీ, న్యూయార్క్పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో ఇప్పటి వరకు 24,24,168 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 1,23,473 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 10,20,381 మంది కోలుకున్నారు.ప్రపంచంలో రెండు వారాల క్రితం దాకా కొన్ని దేశాల పరిస్థితి మెరుగ్గానే ఉండేది. కానీ, సీన్ రివర్స్ అయింది. కేసుల విషయంలో ఎక్కడో చాలా దూరంలో ఉన్న దేశాలూ ఇప్పుడు టాప్20లోకి వచ్చేశాయి. పెరూ, చిలీ వంటి దేశాలైతే టాప్10లోకి వచ్చాయి.
మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ టాప్20లో ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం వరకు ఆఫ్రికాలో పరిస్థితి బెటర్ అని అనుకున్నా, ఇప్పుడు సౌతాఫ్రికాలోనూ కేసులు పెరగడం కలవరపెడుతోంది. మొత్తంగా ప్రపంచంలోని 19 దేశాల్లో లక్షకు పైగా కేసులు నమోద య్యాయి. మొత్తంగా ప్ర పంచంలో 92 లక్షల 68 వేల 698 మంది కరోనా బారిన పడగా, 4 లక్షల 76 వేల 373 మంది చనిపోయారు. రికవరీలు ఐదు మిలియన్లకు అంటే 50 లక్షలకు దగ్గర్లో ఉన్నాయి. మొత్తంగా ఇప్పటిదాకా 49 లక్షల 92 వేల 150 మంది ఆస్పత్రుల నుంచి కోలుకున్నా రు. 28 రోజులుగా రోజూ లక్షకు పైనే కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి దాకా జూన్ 19న అత్యధికంగా లక్షా 82 వేల 202 కేసులు రిపోర్ట్ అయ్యాయి. కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కరో జులో నమోదైన కేసుల్లో అదే రికార్డ్. దాదాపు 24.01 లక్షల కేసులు, లక్షా 23 వేలకుపైగా మరణాలతో అమెరికా మొదటి స్థానంలో ఉంది. మొన్నటి దాకా రోల్ మోడల్ అనుకున్న దేశాల్లోనూ ఇప్పుడు కరోనా మళ్లీ విజృంభిస్తోంది. సౌత్ కొరియాలో సెకండ్ వేవ్ మొదలైంది. ఈ విషయాన్నిఆ దేశం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం అక్కడ 12,484 మంది కరోనా బారిన పడ్డారు. 281 మంది చనిపోయారు. కేసులు తక్కువగానే ఉన్నా ఆ దేశం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది.