మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటివరకు మండలంలో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే మరిపెడ శివారు మాకుల తండాకు చెందిన మహిళ అనారోగ్యంతో వుండగా మండలంలోని తండా ధర్మారం అయిన తన తల్లి ఇంటికి పదిరోజుల క్రితం వెళ్ళింది. అనారోగ్యంతో వుండగా హైదరాబాదు వెళ్ళి కరోనా పరీక్షలు చేయించుకోగా ఆమెకు వైద్య పరీక్షలు చేయగా కరోనా నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు మాకుల తండలో, తండ ధర్మారం తండాలో డియంహెచ్ఓ, శ్రీరాం, డిప్యూటీ డిఎంహెచ్ఓ కోటాచలం ఇతర అధికారులు పూర్తి వివరాలు తెలుసు కుంటున్నారు.