24 గంటల్లో కొత్తగా 648 మందికి పాజిటివ్..ముగ్గురు మృతి
రాష్ట్రంలో రోజువారి కొరోనా కొత్త కేసులు కొంత తగ్గాయి. బుధవారం 691 పాజిటివ్ కేసులు నమోదు కాగా గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 648 కేసులు నమోదయ్యాయి. కాగా, వైరస్ నుంచి 96 మంది కోలుకున్నారు.
వైరస్ కారణంగా ముగ్గురు మృతి చెందారు. జిహెచ్ఎంసి పరిధిలో కొత్తగా 82 కేసులు నమోదవగా, కరీంనగర్ జిల్లాలో 59 కేసులు, వరంగల్ అర్బన్ జిల్లాలో 52 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,39,369 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,774కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,25,738 కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 9,857గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది.