Take a fresh look at your lifestyle.

దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్న కొరోనా

ఒక్కరోజే కొత్తగా 78,357 కేసులు నమోదు

దేశంలో కొరోనా వైరస్‌ ‌విజృంభణ కొనసాగుతుంది. ప్రపంచ దేశాల్లో ఎక్కువ కొరోనా కేసులు ఉన్నప్పుడు భారత్‌లో చాలా తక్కువ పాజిటివ్‌ ‌కేసులు నమోదు అవుతూ వచ్చాయి. ప్రస్తుతం ఇండియాలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా ఒక్కరోజే 78357 కొత్త కేసులు నమోదయ్యాయి. దీనితో దేశంలో  మొత్తం కొరోనా బాధితుల సంఖ్య 3769524కు చేరింది. వీరిలో ఇప్పటికే 29లక్షల మంది కోలుకోగా మరో 8లక్షల యాక్టీవ్‌ ‌కేసులు ఉన్నాయి. వైరస్‌ ‌కారణంగా కొత్తగా మరో 1045 మంది ప్రాణాలు విడువగా మొత్తం మరణాల సంఖ్య 66333కు చేరింది. దేశవ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజే 1012367 టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్‌. ‌

ఫలితంగా మొత్తం టెస్‌ల్ట సంఖ్య 4 కోట్ల 43 లక్షలకు చేరింది. కరోనా మహమ్మారి కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. రికవరీ అయ్యేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. దేశవ్యాప్త రికవరీ రేటు 76.98 శాతంగా ఉండగా డెత్‌ ‌రేటు 1.76 శాతానికి పడిపోయింది. ఢిల్లీలో కొరోనా మళ్లీ పెరుగుతోంది. కొత్తగా 2300 కేసులొచ్చాయి. జులై నుంచి ఇప్పటివరకూ ఒకే రోజు ఇన్ని ఎక్కువ కేసులు రావడం ఇదే తొలిసారి. ఫలితంగా ఢిల్లీ రికవరీ రేటు 88.5 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కొరోనా కేసులున్న దేశాల్లో… అమెరికా బ్రెజిల్‌ ‌తర్వాత భారత్‌ ‌మూడో స్థానంలో ఉంది. వచ్చే వారం రోజుల్లో అత్యధిక కేసుల్లో బ్రెజిల్ని వెనక్కి నెట్టి ఇండియా రెoడో స్థానానికి చేరేలా ఉంది. అలాగే కొత్త కేసుల  నమోదులో ఇండియా 27 రోజులుగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. మొత్తం మరణాల్లో అమెరికా, బ్రెజిల్‌ ‌తర్వాత ఇండియా మూడో స్థానంలో ఉంది. రోజువారీ మరణాల్లో బ్రెజిల్‌ అమెరికా తర్వాత భారత్‌ ‌మూడో స్థానానికి చేరింది. దేశంలోనే మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండటమే కాదు అత్యధికంగా కోవిడ్‌19 ‌కేసులు నమోదయిన దేశాల కంటే ఐదో స్థానంలో ఉంది.

మహారాష్ట్రలో మరో 320 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాలు 24903కి చేరాయి. ఏపీలో మరో 10368 కేసులు బయటడ్డాయి. వరుసగా ఏడో రోజు 10వేల కేసులు నిర్ధారణ అయ్యాయి. ఏపీలో మొత్తం కేసులు 445139కి చేరుకున్నాయి. మొత్తం 4503 మంది ప్రాణాలు కోల్పోయారు. చెన్నైలో దాదాపు 21.5 శాతం మంది ప్రజలు కరోనా బారిన పడినట్లు ఓ సర్వే వెల్లడించింది. సెరో సర్వైలెన్స్ ‌స్టడీ ప్రాథమిక విచారణ ద్వారా ఈ విషయం బయటపడింది. దీనికోసం నగరంలోని మొత్తం 15 జోన్లలోని 51 వార్డుల నుంచి 12405 మంది రక్త నమూనాలను సేకరించారు. వీరిలో 2673 మంది కొరోనా బారిన పడినట్లు తేలింది.

Leave a Reply