పరిశుభ్రమే కరోనా వైరస్కు నియంత్రణ అని జనగామ ఆర్డీవో సీహెచ్ మధుమోహన్ అన్నారు. గురువారం బస్టాండ్లో డీఎం ధరంసింగ్ ఆధ్వర్యంలో ప్రయాణికులకు కరోనా నియంత్రణపై ఆర్డీవో అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ప్రయాణం చేస్తున్న సమయంలో మాస్క్లను ధరించడమే గాకుండా తగు జాగ్రత్తలను పాటిస్తే కరోనా దరిచేరదన్నారు. అలసత్వం, నిర్లక్ష్యం సరైంది కాదని వివరించారు. వారివెంట తహశిల్దార్ రవీందర్, ఆర్టీసి సిబ్బంది పాల్గొన్నారు.