జ్యోతిరాదిత్య సింధియాను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ఏఐసీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. సింధియా బహిష్కరణకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమోదముద్ర వేసినట్టు పేర్కొంది.
కమల్నాథ్ నాయకత్వంలోని మధ్యప్రదేశ్లోని కాంగ్రెస్ సర్కారును కూల్చివేతకు యత్నించడమే గాకుండా ప్రత్యర్థి పార్టీ బీజేపీతో కుమ్మక్కై నందుకు ఆగ్రహించిన సోనియా ఈ విధంగా సింధియాను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించింది.