కొరోనా కట్టడిలో భాగంగా సంయుక్త పరిశోధనకు ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ నడుంబిగించాయి. నగరంలోని కంటైన్మెంట్ జోన్లలో రక్తనమూనాలను బృందం సేకరించే పనిపడింది. శనివారం మియపూర్ సాయినగర్ కాంటైన్మెంట్ జోన్లో ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ బృందం రక్త నమూనాలను సేకరిస్తోంది. దేశ వ్యాప్తంగా ఈ సర్వే ద్వారా లక్షణాలు లేని వ్యాధిగ్రస్థుల సమాచారం వెలుగులోకి రానుంది. హైదరాబాద్ లో 5 కంటైన్ మెంట్ జోన్లలో రెండు రోజులపాటు సర్వే నిర్వహించనుంది. ఆదిభట్ల, బాలాపూర్, మియాపూర్, చందానగర్, టప్పాచబుత్రా ప్రాంతాల్లో 10 ప్రత్యేక టీమ్ ల ద్వారా సర్వే చేపట్టనుంది. పెరుగుతున్న కేసులు, నాన్ సింప్టమాటిక్ కేసులపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వనుంది. ఇప్పటికే తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఎఅఓఖీ సర్వే పూర్తి చేసింది. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లో అధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. డబుల్ డిజిట్స్లో కేసులు రికార్డవుతుండడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.