పార్మాసిటీ వ్యవహరాన్ని ఒక పెద్ద బ్రోకరేజ్ వ్యవస్థలా కేసీఆర్ ప్రభుత్వం మార్చిందని సీఎల్పీనేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. కేసీఆర్ ఒక ముఖ్యమంత్రిలా కాకుండా భూముల దలారీలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు . సోమవారం అసెంబ్లీ లోని మీడియా పాయిట్ వద్ద ఆయన మీడియా తో మాట్లాడుతూ … ఫార్మాసిటీ పేరుతో ప్రభుత్వం దమనకాండ చేస్తోందని ఆరోపించారు.కేసీఆర్ ప్రభుత్వం ప్రజల కోసం కాకుండా ఒక దలారి వ్యవస్థలా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులుకు మూడు ఎకరాలు పంచుతామని హామీలు ఇచ్చిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చా కాంగ్రెస్ ప్రభుత్వం దళిత, గిరిజన, పేద వర్గాలకు పంచిన భూమిని అక్రమంగా లొక్కొంటోందని విమర్శించారు.. అన్న వస్త్రాల కోసం పోతే.. ఉన్న వస్త్రాలు ఊడ్చేసినట్లుగా కేసీఆర్ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. పార్మా సిటీ పేరుతో 6 గ్రామాల్లోని దాదాపు 8 వేల దళిత, గిరిజన, పేదల భూములను కేసీఆర్ ప్రభుత్వం బలవంతంగా గుంజుకొంటోందన్నారు.
ప్రజాప్రయో