Take a fresh look at your lifestyle.

పథకాల అమలుకే ప్రాధాన్యం కలెక్టర్లకు సీఎం కేసీఆర్‌ ‌హెచ్చరిక

CM KCR Excellence for Collectors Priority for Implementation of Schemes

  • కలెక్టర్‌ ‌వ్యవస్థ బలోపేతానికే అదనపు కలెక్టర్లు
  • ప్రతీ జిల్లాలో పంచాయతీరాజ్‌ ‌సమ్మేళనం
  • పట్టణాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి
  • 20 రోజుల్లో  గ్రామాల రూపురేఖలు మార్చాలి
  • అభివృద్ధి జరగని పక్షంలో కఠినచర్యలు
 రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం రూపొందించిన పథకాలను అమలు చేయడమే జిల్లాల యంత్రాంగం ప్రధానబాధ్యతని, ప్రభుత్వ సంక్షేమ కార్యకమ్రాలకు పాధాన్యతను ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌జిల్లా కలెక్టర్‌లకు ఉద్భోదించారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను వారికి  వివరించారు.   ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు  చేసే నిర్ణయాలను అధికారయంత్రాంగం అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ది, ప్రజల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకొని తమ ప్రభుత్వం బృహత్తర కార్యక్రమాలను రూపొందిస్తున్నదని ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకపోవడంలో కలెక్టర్‌లు కీలకబాధ్యత వహించాలని ఆదేశించారు.త్వరలో ప్రతీ జిల్లాలో పంచాయతీరాజ్‌సమ్మేళనం నిర్వహించాలని  చెప్పారు. కలెక్టర్‌ ‌వ్యవస్థను బలోపేతం చేసేందుకే అదనపుకలెక్టర్‌ ‌వ్యవస్థని వివరివచారు. మంగళవారం ప్రగతిభవన్‌లో   జిల్లా కలెక్టర్‌లకు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం నమూనాలపై సీఎందిశానిర్ధేశం చేశారు.  ఆరుగంటలకుపైగా  కొనసాగిన ఈ సమావేశంలో సీఎం  ప్రతీ కలెక్టర్‌ను పలుకరించడంతోపాటు ఆయా జిల్లాల్లో  జరుగుతున్న పనులను సమీక్షించారు.
రాష్ట్ర మంత్రులు, రా్ర•, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, నీటిపారుదల సలహాదారు ఎస్‌,‌కే.జోషి ఇతర సలహాదారులు, మూసీనదీప్రాంత అభివృద్ది చైర్మన్‌, ‌శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి 33 జిల్లాల కలెక్టర్‌లు, కొత్తగా నియామకం పొందిన అడిషనల్‌కలెక్టర్‌లు, ఈ సదస్సుకు హాజరయ్యారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర శాసనసభలో చర్చించి, నిపుణుల సలహాలను స్వీకరించి, న్యాయనిపుణుల అభిప్రాయాలను సేకరించి పకడ్బందీగా చట్టాలను రూపొందిస్తున్నామని, ఆయా చట్టాలను, చట్టాల ప్రయోజనాలను, వాటిఫలాలను ప్రజలకందించాల్సిన బాధ్యత అధికారులదేనని సీఎం సూచించారు. రాష్ట్ర శాసనసభ,శాసనమండలి ఆమోదం పొందిన కొత్త పంచాయతీరాజ్‌, ‌కొత్త మున్సిపల్‌చట్టాలు ఈ కోవలోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు. కొత్తగా ఎన్నికైన మున్సిపల్‌ ‌చైర్మన్‌లు, కార్పొరేషన్‌ ‌మేయర్‌ల ప్రాధాన్యతలను తీసుకొని ఆయా పట్టణాలకు, నగరాలకు వర్తించే విధంగా ప్రతీపట్టణానికి అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని,  ప్రణాళికలు ఆయా పట్టణాల,నగరాల ప్రజల ఆశలకు, ఆశయాలకు ప్రతిబింబం కావాలని సూచనలు చేశారు. త్వరలో పల్లెప్రగతి తరహాలోనే పట్టణ ప్రగతి కార్యక్రమం తీసుకుంటామని, ప్రతీ నెల పంచాయతీరాజ్‌శాఖకు రూ.339 కోట్లు విడుదల చేస్తున్న తరహాలోనే, మున్సిపల్‌ అర్బన్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌శాఖకు ప్రతీ నెల రూ.2000కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యలు ఉండరాదని,  ప్రజల సమిష్టి  అభివృద్ధి  లక్ష్యం కావాలనని సీఎం నిర్దేశించారు. ప్రతీ చట్టం వాస్తవిక దృష్టితో, ప్రజల విస్తృత ప్రయోజనాలకు, ఆకాంక్షలకు సమాధానాలను ఇచ్చే విధంగా కొత్త చట్టాలు ఉన్నాయని పేర్కొన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం అమలులో ఉన్న మనదేశంలో ప్రజలచే ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు చాలా బాధ్యతలు ఉంటాయని,   , ప్రజల కోసం చట్టాలను తీసుకరావాలని, ప్రజలకోసమే వాటిని అమలు చేయాలని, చెప్పారు.
image.png

అడిషనల్‌ ‌కలెక్టర్‌  ‌వ్యవస్థ ఆషామాజీ కాదు
కలెక్టర్‌ల వ్వవస్థను బలోపేతం చేసేందుకే అదనపు కలెక్టర్లని  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పునురుద్ఘాటించారు. ఇదివరలో కలెక్టర్‌లు జిల్లాలో 112 రకాల కమిటీలకు చైర్మన్‌లుగా ఉండేవారని వాటిని కుదించి 26 కమిటీలకు బాధ్యులను చేశామని, మిగతా బాధ్యతలన్నింటినీ అదనపు కలెక్టర్లకు విభజించామని పేర్కొన్నారు.పచ్చదనం, పనిశుభ్రతలకు  కలెక్టర్‌లకు ఎంత బాధ్యత ఉంటుందో, అంతే బాధ్యత అదనపు కలెక్టర్‌లకు ఉంఉటందని చెప్పారు. అడిషనల్‌ ‌కలెక్టర్‌ ‌వ్యవస్థను ఆషామాషీగా తీసుకోవద్దని సీఎం హెచ్చరించారు. స్థానిక సంస్థలకు ఉండే హక్కులను, చట్టాలను, • ప్రజాప్రతినిధుల హక్కులు ప్రాధాన్యాలను   లోకల్‌బాడీలకోసం నియుక్తులైన అడిషనల్‌ ‌కలెక్టర్‌లు బాధ్యతవహించాలని చెప్పారు.   రెవెన్యూ, రిజి•స్టేష్రన్స్, ‌ప్రోటోకాల్‌ అవసరాలకోసం నియుక్తులైన అడిషనల్‌ ‌కలెక్టర్‌లు  అడ్మినిస్ట్రేషన్‌ ‌వ్యవహరాలను పర్యవేక్షించాలని చెప్పారు. ప్రతీ 500 జనాభాగల గ్రామపంచాయతీకి రూ.10లక్షల వరకు ఏటా నిధులు ఇస్తున్నందున రోడ్ల విస్తరణ, గ్రామపారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, పాఠశాలల నిర్వహణ, మొక్కల పెంపకం వంటి ప్రతీపాఠశాల, అంగన్‌వాడీల నిర్వహణ,  మొక్కల ల మొక్కల పెంపకం వంటి ప్రతీ అంశాన్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, కావాల్సిన సలహాలు, సూచనలు ఇచ్చి నిరంతర అభివృద్ధికి అడిషనల్‌ ‌కలెక్టర్‌లు చోదకులు కావాలని పిలుపు నిచ్చారు మంత్రులు ప్రతీ సందర్భంలో జిల్లాలు  పర్యటిస్తుంటారని, ప్రధానంగా  ఆదిలాబాద్‌, ‌కుమ్రంభీం, నిర్మల్‌ ‌వంటి జిల్లాలో పోడు భూముల సమస్యలు ఉన్నాయని, అక్కడి సమస్యలన్నింటిపైన ఎప్పటికప్పుడు నివేదికలను అందించాలని ఆదేశించారు.ప్రతీ సమస్యకు స్థానిక పరిష్కారాలను ఇవ్వాలని ఆదేశించారు. మిషన్‌భగీరథ• ఇంతవరకు అందని ఆవాసాలనైన దృష్టిపెట్టాలని, చాలా చోట్ల సాంకేతిక సమస్యలతోనే  పనులు పూర్తి కావడంలదేని, అయినప్పటికీ యంత్రాంగం వేగంగా పనిచేయాలని, అలసత్వం ప్రదర్శించవద్దని, అలసత్వం ప్రదర్శించే వారిపైన అడిషనల్‌ ‌కలెక్టర్‌లు కఠినంగా ఉండాలని పేర్కొన్నారు.

పదిహేను రోజుల్లో పంచాయతీరాజ్‌సమ్మేళనం
పదిహేనురోజుల్లో పంచాయతీరాజ్‌ ‌సమ్మేళనం నిర్వహించాలని ఆదేశించారు.ప్రతీ జిల్లాలో ఈ సమ్మేళనాలు జరగాలని  సీఎం సూచించారు. ఆయా జిల్లాలోని సర్పంచ్‌లు, గ్రామకార్యదర్శులు, ఎంపీటీసీలు, జడ్పీటీసిలను సమ్మేళనానికి ఆహ్వానించాలని చెప్పారు ఇరవై రోజుల్లో గ్రామాల రూపురేఖలు మారాలని హెచ్చరించారు.పంచాయతీరాజ్‌ ‌సమ్మేళనంలో డిఎల్‌పీవోలు, డీపీవో, జడ్పీ సీఈవోలు ఈ సమ్మేళనానికి బాధ్యులుగా ఉండాలని తెలిపారు. ప్రతీ గ్రామంలో అభివృద్ధి ప్రణాళికలు రచించాలని, గ్రామసభలు నిర్వహించాలని, గ్రామాల పారిశుద్ధ్యం , పరిశుభ్రత, మొక్కల పెంపకం, మంచినీటిసరఫరా, వంటి ప్రతీ అంశం పైన శ్రద్ద తీసుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల పర్యవేక్షణకోసం నియమించిన అదనపు కలెక్టర్‌లు ఈ బాధ్యతలను తీసుకోవాలని పేర్కొన్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనఖీలు ఉంటాయని, ఫ్లైయింగ్‌స్వ్కాడ్‌లు ప్రతీగ్రామాన్ని పర్యటిస్తారని చెప్పారు. నిర్ధేశిత లక్ష్యాలకు అనుగుణంగా గ్రామాల్లో అభివృద్ధి జరగని పక్షంలో కఠిన చర్యలు ఉంటాయని సీఎంహెచ్చరించారు..తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత కొద్ది సంవత్సరాల్లోనే అనేక రంగాల్లో నిరుపమాన అభివృదద్ధి సాధించామని కేంద్రం నుంచి సహాయ సహకారాలు లేకున్నా, కాళేశ్వరం వంటి బహుళార్థ సాధక ప్రాజెక్ట్‌లను నిర్మించుకొని కోటి ఎకరాలకు నీరందరించే దిశలో ముందువరుసలో నిలిచామని, నిరంతర విద్యుత్తు సరఫరాలో దేశానికే ఆదర్శంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో 40వేల కోట్ల రూపాయలతో సంక్షేమం, అభివృద్ధి కార్యకమ్రాలు అమలవుతున్నాయని చెప్పారు.కేసీఆర్‌ ‌కిట్స్, ‌కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌  ‌పెన్షన్లు, కంటివెలుగు వంటి కార్యక్రమాలు ప్రతీ పేద ఇంటి తలుపుతట్టాయని సీఎం ఉదహరించారు.  సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని పేర్కొన్నారు.

Leave a Reply