మేయర్లు, చైర్మన్ల అవగాహన సదస్సులో మంత్రి బొత్స
సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచనలను మేయర్లు, ఛైర్మన్లు ముందుకు తీసుకెళ్లాలని మంత్రి బొత్స సత్యానారయణ సూచించారు. ఇరవై నెలల ప్రభుత్వ ఆలోచలను చూసి ఏకపక్షంగా ప్రజలు మిమ్మలను గెలిపించారని తెలిపారు. అధికారాలతో పాటు, బాధ్యతలు గుర్తెరిగి పనిచేయాలని సూచించారు. కొత్తగా ఎన్నికైన ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మంత్రి బొత్స, పురపాలక సంఘం ప్రత్యేక కార్యదర్శి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు ప్రజలకు చేరువ చేయాలి.
ప్రజలతో మమేకమై … వారి సమస్యలు తీర్చితేనే.. మనకు గుర్తింపు ఉంటుంది. మళ్లీ మనలనే ఎన్నుకోవాలి అనేలా వి• పాలన సాగాలి. రేపు సీఎం కూడా వి• అందరనీ కలిసి ప్రభుత్వ ఉద్దేశాలను, ప్రణాళికను వి•కు వివరిస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రత్యేక కార్యదర్శి వై.శ్రీలక్ష్మి మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కారం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలు మన పని తీరు, ఆలోచనలను కూడా గమనిస్తూ ఉంటారన్నారు. తమ ప్రాంతాలను అభివృద్ధి అయ్యేలా చరిత్రలో నిలిచేలా మంచి కార్యక్రమాలు చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి సమన్వయంతో పని చేయాలన్నారు. వేసవిలో తాగు నీటి ఇబ్బంది లేకుండా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని శ్రీలక్ష్మీ తెలిపారు.