అమరావతి,జూన్ 18: కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు.
ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారితోపాటు, తెలంగాణ వారికీ ఎక్స్గ్రేషియా వర్తింపచేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర పరిధిలోనే ప్రమాదం జరగడంతో మానవతా దృక్పథంతో మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. అందరికీ పరిహారం ఇచ్చేలా సిఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు.