నగరంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా విజృంభణతో స్వచ్ఛందంగా విద్యా, వాణిజ్య సంస్థల మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు.
విజయవాడ బులియన్ మర్చంట్స్, బెజవాడ జ్యూయలరీ బులియన్ మర్చంట్ అసోసియేషన్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 26 నుంచి మే 3 వరకు జ్యూయలరీ షాపుల బంద్కు నిర్ణయించారు.