- ప్రైవేటు కంపెనీ కాదు..
- రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం ?
- రేవంతుడు దూకుడు.. జగ్గారెడ్డి బ్రేకులు?
- కాంగ్రెస్లో ఏం జరుగుతుంది..
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శుక్రవారం కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి…అదే పార్టీకి చెందిన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని తనదైన శైలిలో విరుచుకుపడ్డారనీ సమాచారం. టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డిపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడు కాకముందే తాను మూడు సార్లు ఎమ్మెల్యేని అయ్యానంటూ మండిపడ్డారు. ఇక్కడ ఆయన(రేవంత్) హీరో ఏమీ కాదు. హీరోయిజం పనికి రాదు. రేవంత్ కంటే ఇక్కడ నేను తోపును. ఇది కాంగ్రెస్ పార్టీనా..? ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా? అంటూ ఓ రేంజ్లో ఆగ్రహం వ్యక్తం చేశారనీ సమాచారం. పార్టీ సీనియర్లతో చర్చించకుండానే రెండు నెలల కార్యాచరణ ఎలా ప్రకటిస్తారని మండిపడ్డారనీ తెలుస్తుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రేవంత్ పీసీసీ కాకముందే తాను మూడు సార్లు ఎమ్మెల్యేనీ అయ్యానంటూ ఫైర్ అయ్యారు. అంతేకాకుండా పార్టీ ముఖ్య నాయకుల మధ్య ఆవేశంతో ఊగిపోయిన ఆయన, ఇది కాంగ్రెస్ పార్టీనా.. ? ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా అంటూ మండిపడ్డాడు. చర్చలేకుండానే 2 నెలల కార్యాచరణ ఎలా ప్రకటిస్తారని మండిపడ్డారు. జహీరాబాద్లో కార్యక్రమాలపై గీతా రెడ్డికి సమాచారం ఇవ్వరా? సంగారెడ్డికి వొస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ నైన నాకే సమాచారం ఇవ్వరా? అంటూ నిలదీశాడు.
కనీసం ప్రోటోకాల్ పాటించరా..? నాతో విభేదాలు ఉన్నట్లు రేవంత్ చెప్పాలని అనుకుంటున్నాడా?.. ఎప్పుడూ కాంగ్రెస్లో ఏ ఒక్కరో హీరో కాలేరని కాంగ్రెస్ నాయకులపై జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు అయ్యాక రేవంత్ రెడ్డి చూపిస్తున్న దూకుడు పార్టీలోని సీనియర్ నేతలకు మింగుడుపడటం లేదు. దండోరాలు, ఆత్మగౌరవ సభల పేరుతో ఆయన అన్ని జిల్లాలను చుట్టేస్తూ కేడర్లో ఉత్సాహం నింపుతున్నారు. అయితే తమ జిల్లాలు నియోజకవర్గాల్లో పార్టీ సభలు, పర్యటనలు చేపట్టే ముందు తమకు సమాచారం ఇవ్వడం లేదంటూ చాలామంది ఆయనపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శుక్రవారం కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ..టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ పార్టీ ప్రోటోకాల్ పాటించం లేదని, తనతో విభేదాలు ఉన్నట్లు రేవంత్ బహిరంగంగా చెప్పాలని అనుకుంటున్నాడా? అంటూ నిలదీశారు.
కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరో హీరోలు కాలేరని, ఒక్కటి ఇమేజ్ కోసం మిగతా వారిని తొక్కే ప్రయత్నం కొనసాగుతుందని జగ్గారెడ్డి మండిపడ్డారనీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇదిలా, ఉంటే రేవంత్ రెడ్డి పార్టీ కార్యక్రమాలతో దూకుడుగా ఉన్నారు. తెలంగాణ సర్కారుకు సవాళ్ళను విసురుతూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. సొంత పార్టీకి చెందిన జగ్గారెడ్డి గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అయితే, పార్టీకి చెందిన చాలా మంది సీనియర్లు రేవంత్ రెడ్డితో మంచిగానే ఉంటున్నారు..ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి సైతం.. రేవంత్ రెడ్డితో బాగానే ఉంటున్నారు. ఒక జగ్గారెడ్డి మాత్రం..అడుగడుగునా, సందర్భం చేసుకుని మరీ రేవంత్ రెడ్డిపై మాటల తూటాలు పేలుస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ.. జగ్గారెడ్డి మరింత రెచ్చి పోయి మాట్లాడటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. రేవంత్ రెడ్డిని ఇష్టానుసారంగా జగ్గారెడ్డి మాట్లాడటం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. జగ్గారెడ్డి మాట్లాడుతున్న తీరును బట్టి ఆయన వెనకాల ఎవరో ఉన్నారన్నది స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, వారు సొంత పార్టీకి చెందిన వారా?మరో పార్టీకి చెందిన వారా? తేలాల్సి ఉంది. ప్రస్తుత పరిణామాలను రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నారని సమాచారం. కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ముఖ్యంగా అధికార టీఆరెస్ పార్టీకి చెందిన నేతలు లోలోపల యమ ఎంజాయ్ చేస్తున్నారని సమాచారం. రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి మాటల దాడి ఎటువైపు దారి తీస్తుందోననీ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.