సుప్రీమ్ కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ రోశయ్య నివాసాని వెళ్లి పార్థివదేహం వద్ద నివాళి అర్పించి, ఆయనకు పుష్పాంజలి ఘటించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోశయ్య మరణం బాధ కలిగించిందన్నారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్త నుంచి సీఎం, గవర్నర్ స్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తని కొనియాడారు. కళలు, సాహిత్యంపై అభిమానం ఉన్న వ్యక్తన్నారు. ఆయన సేవలు మరువలేనివని, అన్ని పదవులకు వన్నె తీసుకువచ్చారన్నారు.