Take a fresh look at your lifestyle.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితతో ఛాటింగ్‌

‌వాట్సప్‌ ‌స్క్రీన్‌ ‌షాట్స్ ‌విడుదల చేసిన సుఖేష్‌ ‌చంద్రశేఖర్‌

న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 12 : ‌మనీలాండరింగ్‌, ‌చీటింగ్‌ ‌కేసులో దిల్లీ జైలులో ఉన్న సుఖేష్‌ ‌చంద్రశేఖర్‌…‌బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితపై బాంబ్‌ ‌పేల్చారు. ఢిల్లీ మండోలి జైల్లో ఉన్న సుఖేష్‌  ఈసారి చాటింగ్‌ ‌బాంబ్‌ ‌పేల్చాడు. ఎమ్మెల్సీ కవితతో తాను చేసిన వాట్సప్‌ ‌చాట్‌ ఇదేనంటూ పలు స్క్రీన్‌ ‌షాట్స్ ‌విడుదల చేశాడు తెలుగు రాని సుఖేశ్‌  అక్కడక్కడా తెలుగు పదాలతో చాట్‌ ‌చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. అక్కా అంటూ పలుమార్లు చాట్‌లో సంభోధించాడు. డబ్బు డెలివరీ చేశానంటూ వాట్సప్‌ ‌చాట్‌లో పేర్కొన్నాడు సుఖేశ్‌. ‌స్పోకెన్‌ ‌టూ మనీష్‌ అని రిప్లై కూడా ఇచ్చాడు. గతంలో దిల్లీ సీఎం కేజీవ్రాల్‌కు రాసిన లేఖలో సంచలన విషయాలు వెల్లడించాడు. కేజీవ్రాల్‌, ‌దిల్లీ మాజీ మంత్రి సత్యేంద్రజైన్‌ ఆదేశాలపై హైదరాబాద్‌ ‌బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌లో రూ.15 కోట్ల డబ్బులు ఎమ్మెల్సీ కారులో ముట్టజెప్పినట్టు ఆరోపించాడు. అరుణ్‌ ‌రామచంద్ర పిల్ళై ద్వారా డబ్బులు అందచేసినట్టు లేఖలో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత పేరును..తన ఫోన్‌ ‌నెంబర్‌లో కవిత అక్క టీఆర్‌ఎస్‌ ‌పేరుతో సేవ్‌ ‌చేసుకున్నాడు. కవితతో చాటింగ్‌ ‌చేసినట్లు చెబుతున్న ఆరు పేజీల చాట్‌ ‌వివరాలను వెల్లడించాడు. అక్కా.. అక్కా అంటూ పరుమార్లు తెలుగులోనూ చాట్‌ ‌చేయటం విశేషం.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితతో చాట్‌ ‌చేసిన వివరాలతో పాటు.. ఎవరి ఆదేశాలతో డబ్బులు.. ఎక్కడ.. ఎప్పుడు అప్పగించింది వివరంగా రాస్తూ.. దీనిపై విచారణ చేయాలంటూ లేఖను చీఫ్‌ ‌జస్టిస్‌ ఆఫ్‌ ఇం‌డియా, కేంద్ర హోమ్‌ ‌మంత్రికి, దిల్లీ లెప్ట్‌నెంట్‌ ‌గవర్నర్‌కు.. సీబీఐ డైరెక్టర్‌కు, ఎన్‌ ‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌(ఈడీ)కి పంపించారు. వాట్సాప్‌ ‌చాట్‌లో కోడ్‌ ‌భాష వివరాలను కూడా లేఖలో స్పష్టం చేశారు. ఏకే అంటే అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ అని..ఎస్‌జే అంటే సత్యేంద్రజైన్‌ అని.. మనీష్‌ అం‌టే మనీష్‌ ‌సిసోడియా అని.. అరుణ్‌ అం‌టే అరుణ్‌ ‌పిల్ళై అని.. జేహెచ్‌ అం‌టే జూబ్లీహిల్స్ అని.. ఆఫీస్‌ అం‌టే పార్టీ హెడ్‌ ‌క్వార్టర్‌ ఆఫ్‌ ‌ద టీఆర్‌ఎస్‌ అని.. ప్యాకేజీ అంటే 15 కోట్ల రూపాయలు అని వివరించాడు. బ్రో అంటే సత్యేంద్రజైన్‌ అని.. 15కేజీ నెయ్యి అంటే 15 కోట్ల రూపాయల డబ్బు అని.. 25 కేజీ నెయ్యి అంటే 25 కోట్ల రూపాయలు అని.. సిస్టర్‌ అం‌టే కె.కవిత అని.. ఏకే భాయ్‌ అం‌టే అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ అని కోడ్‌ ‌భాష వివరాలను సుఖేష్‌ ‌రివీల్‌ ‌చేశాడు. సుఖేష్‌ ‌చాటింగ్‌పై బీఆర్‌ఎస్‌ ‌పార్టీలో చర్చనీయాంశం కాగా.. సుఖేష్‌కు తెలుగు వొచ్చా అనే డౌట్స్ ‌వ్యక్తం అవుతున్నాయి. కవిత బ్రో అని సంబోధిస్తే..కవిత అక్కా అంటూ తెలుగు సుఖేష్‌ ‌మాట్లాడటం విశేషం…రూ. 200 కోట్ల మనీలాండరింగ్‌ ‌కేసులో అరెస్టయిన సుఖేశ్‌ ‌ప్రస్తుతం దిల్లీ జైలులో ఉన్నాడు. ఆప్‌ ‌నేతలపై కొన్నాళ్లుగా సంచలన ఆరోపణలు చేస్తూ వొస్తున్నారు. ఎమ్మెల్సీ కవితకు డబ్బులు ఇచ్చినట్లు గతంలోనే ప్రకటించాడు. ఇప్పుడు వాట్సాప్‌ ‌చాట్‌ ‌రిలీజ్‌ ‌చేయటంతోపాటు.. దీనిపై విచారణ చేయాలని సీబీఐ, సుప్రీమ్‌ ‌కోర్టు జడ్జి, గవర్నర్‌, ‌కేంద్ర హోమ్‌ ‌మంత్రికి లేఖలు రాయటం సంచలనంగా మారింది.

Leave a Reply