Take a fresh look at your lifestyle.

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో కీలక మలుపు

  • సిఎం అరవింద్‌ ‌కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీసులు
  • రేపు హాజరు కావాలని ఆదేశాలు

న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 14 : ‌దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో కీలక మలుపు చోటు చేసుకుంది. దిల్లీ సీఎం అరవింద్‌ ‌కేజీవ్రాల్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. రేపు ఏప్రిల్‌ 16‌న విచారణకు రావాలని కేజీవ్రాల్‌కు సమన్లు జారీ చేసింది. కొత్త మద్యం పాలసీ విషయంలో ప్రశ్నించాలని నోటీసుల్లో సీబీఐ పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో దేశ వ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రముఖులు అరెస్టయ్యారు. పలువురిని ఈడీ విచారించింది. మార్చిలో దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ ‌సిసోడియాను అరెస్ట్ ‌చేసింది సీబీఐ. మనీష్‌ ‌సిసోడియా చార్జ్ ‌షీట్‌లో అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ‌పేరు ఉండటంలో ఇప్పుడు ఆయన్ను విచారించాలని సీబీఐ నిర్ణయించింది. మనీష్‌ ‌సిసోడియా ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ నోటీసులు జారీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్‌ 16‌వ తేదీ ఆదివారం ఆయన విచారణకు హాజరవుతారా లేదా అనేది చూడాలి. ఇదే దిల్లీ లిక్కర్‌ ‌స్కాం విషయంపై ఇటీవలే జైల్లో ఉన్న సుఖేష్‌ ‌చంద్రశేఖర్‌ ‌దేశంలోని అన్ని దర్యాప్తు సంస్థలకు లేఖలు రాశారు.

అందులో ఏకే.. అంటే అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ అని.. ఆయన ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో 15 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు కూడా తన లేఖలో వివరించాడు. ఎమ్మెల్సీ కవితతో వాట్సాప్‌ ‌చాట్‌ ‌చేసినట్లు కొన్ని స్క్రీన్‌ ‌షాట్స్ ‌సైతం జైలు నుంచే..తన లాయర్‌ ‌ద్వారా బయటకు విడుదల చేశాడు. దిల్లీ సీఎం అరవింద్‌ ‌కేజీవ్రాల్‌కు లిక్కర్‌ ‌స్కామ్‌లో నోటీసులు జారీ చేయటం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతుంది. సీఎం స్థాయి వ్యక్తిని..100 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి విచారించటం కలకలం రేపుతుంది. ప్రస్తుతం దిల్లీలో పాత లిక్కర్‌ ‌పాలసీనే అమలవుతుంది. మరో ఆరు నెలలు పాత పాలసీని కొనసాగిస్తూ..ఇటీవలే కేజ్రీవాల్‌ ‌నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామాలన్నింటి క్రమంలోనే కేజీవ్రాల్‌కు సీబీఐ నోటీసులు జారీ చేయటం..16వ తేదీ విచారణ రావాలని..14వ తేదీ సమన్లు పంపించటం దేశ రాజకీయాల్లో ఆసక్తి రేపుతుంది.

Leave a Reply