Take a fresh look at your lifestyle.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ ..వెసులుబాటు ..

ఆన్‌లైన్‌లో స్టడీ మెటిరీయల్‌
‌స్టడీ సర్కిళ్ల బలోపేతం
రీడింగ్‌ ‌రూమ్స్ 24 ‌గంటలు తెరిచి ఉంటాయి.
ఫ్రీ మెటిరీయల్‌తో పాటు ఉచిత భోజన వసతి
పటిష్టంగా తెలంగాణపబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌
ఇద్దరు చేసిన తప్పుకు వ్యవస్థను తప్పు పట్టరాదు

తెలంగాణ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌పటిష్టంగా ఉందని…పేపర్‌ ‌లీకేజీ వెనక ఇద్దరు వ్యక్తులు ఉన్నారని.. వాళ్లిద్దరు చేసిన తప్పు అని.. ఇది వ్యవస్థ చేసిన తప్పు కాదని మంత్రి కేటీఆర్‌ ‌వివరించారు.పరీక్షలను రద్దు చేయడం వల్ల లక్షలాది మంది పిల్లలకు ఇబ్బంది కలుగుతుంది. మేం కూడా బాధపడుతున్నాం. నీళ్లు, నిదులు, నియామకాలు అనే పునాది మీదనే తెలంగాణ ఉద్యమం నడించిందన్నారు. అభ్యర్థులు ఎవరూ మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ నాలుగు పరీక్షలు గతంలో రాసిన వారు మళ్లీ చెల్లించాల్సిన అవసరం లేదు. వీలైనంత త్వరగా పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తాం. అభ్యర్థులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో.. గ్రూప్‌-1, ‌టీపీబీవో, డీఏవో, ఏఈఈ ఎగ్జామ్స్‌కు సంబంధించిన మెటిరీయల్‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులో పెడుతాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టడీ సర్కిళ్లను బలోపేతం చేస్తాం. జిల్లాల్లో రీడింగ్‌ ‌రూమ్స్ 24 ‌గంటలు తెరిచి ఉంటాయి. ఫ్రీ మెటిరీయల్‌తో పాటు ఉచిత భోజన వసతి కూడా కల్పిస్తాం అని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. భారతదేశంలోనే అత్యుత్తమ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌లలో ఒకటిగా గుర్తింపు టీఎస్‌ ‌పీఎస్సీ గుర్తింపు పొందిందని.. కాలాగుణంగా సాంకేతికంగా ముందుకు వెళుతుందన్నారు. అందులో భాగంగానే ఓటీఆర్‌.. ‌వన్‌ ‌టైం రిజిస్టేష్రన్‌ ‌తీసుకు రావటం జరిగిందన్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అపోహలు సృష్టించేవారిని నమ్మొద్దని మంత్రి కేటీఆర్‌ ‌తెలంగాణ యువతకు సూచించారు. టీఎస్‌ ‌పీఎస్సీ చైర్మన్‌, ‌నలుగురు మంత్రుల తో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత.. సీఎం కేసీఆర్‌ ‌మాటగా.. శనివారం.. సమావేశం వివరాలను మంత్రి కేటీఆర్‌ ‌వి•డియాకు వివరించారు. వీళ్లిద్దరే కాకుండా లీకేజీ కేసులో ఇంకెవరు ఉన్నా.. అందరినీ కఠినంగా శిక్షిస్తామన్నారు. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు అని.. తెలంగాణ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌పటిష్టంగానే ఉందని, కేవలం ఇద్దరు వ్యక్తుల వల్లే పేపర్‌ ‌లీకేజీ జరిగిందని మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గతంలో దరఖాస్తు చేసుకున్న వారంతా మళ్లీ పరీక్షలకు హాజరు కావొచ్చని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. పారదర్శకత తీసుకురావాలని అనేక చర్యలు చేపట్టడం జరిగింది.ఉమ్మడి ఏపీలో ఏపీపీఎస్సీ వి•ద ఆరోపణలు వచ్చేవి. కానీ 37 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ఒక్క ఆరోపణ కూడా రాలేదు. గతంలో ఇంటర్వ్యూల్లో తప్పులు జరిగాయని టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. రాతపరీక్ష, మెరిట్‌ ‌లిస్ట్ ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాం అని కేటీఆర్‌ ‌తెలిపారు. రాష్ట్ర యువతలో భరోసా నింపాల్సిన బాధ్యత మా వి•ద ఉంది.. కచ్చితంగా ప్రవీణ్‌, ‌రాజశేఖర్‌ అనే ఇద్దరు వ్యక్తులే కాదు.. వీళ్ల వెనకాల ఎవరున్న తప్పకుండా వారిని కఠినంగా శిక్షిస్తాం. ఈ విషయంలో ఎలాంటి రెండో అభిప్రాయం పెట్టుకోవద్దు. ఇది వ్యవస్థ తప్పు కాదు.. ఇది కేవలం ఇద్దరి తప్పు.  ఇదిలా ఉండగా.. టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ ‌లీక్‌ ‌కేసు నిందితులను సిట్‌ ‌కస్టడీకి అప్పగించారు. 9 మంది నిందితులను 6 రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. చంచల్‌గూడ జైలు నుంచి నిందితులను సిట్‌ అదుపులోకి తీసుకుంది. పేపర్‌ ‌లీక్‌ ‌వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలపై సిట్‌ ‌కూపీ లాగనుంది. ప్రశ్నాపత్రం ఎవరెవ్వరికి విక్రయించారనే దానిపై సిట్‌ ఆరా తీయనుంది. నిందితులను మార్చి 23 వరకు సిట్‌ అధికారులు విచారణ చేయనున్నారు.

Leave a Reply