నర్సంపేట: నర్సంపేట నుండి ఏటూరునాగారం వెళ్ళాలనే ప్రయాణీకుల కోసం నూతనంగా బస్ సర్వీసుపు డిపో మేనేజరు శ్రీనివాసరావు ప్రారంబించారు. నూతన సంవత్సర కానుకగా బుధవారం డిపో మేనేజర్ శ్రీనివాసరావు కొబ్బరికాయ కొట్టి బస్సును ప్రారంభించారు. ఈ సందర్బంగా డిపో మేనేజరు మాట్లాడుతూ ఈ అవకాశాన్ని ఏటూరునాగారం వెళ్ళాలనుకునే ప్రయాణీకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి రోజు నర్సంపేట బస్టాండ్ నుండి ఉదయం 11 గంటలకు నల్లబెల్లి, ములుగు, పస్రా, గోవిందరా వుపేట, తాడ్వాయి గ్రామాల ద్వారా ఏటూరునాగారం వెళ్తుందని ఆయన తెలిపారు.
తిరిగి మళ్ళీ ఏటూరునాగారం నుండి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి సాయంత్రం 5 గంటల వరకు నర్సంపేట బస్టాం డుకు వస్తుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ డీ ఐ తోటకూరి వెంకటేశ్వర్లు, సూపర్ వైజర్లు ఎంఎస్.నందం, యాకయ్య, చారి, బస్సు డ్రైవరు సంజీవ, కండక్టర్ సంతోష్, రమణమ్మ, అప్సర్ అలీ, డీవీఆర్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
Tags: narsampet, govt bus, services, driver sanjeevaiah, conductor santhos