Take a fresh look at your lifestyle.

సైన్యం త్రివిధ దళాలలో శౌర్య మహిళలు

“రణరంగంలో పోరాడి గెలవాలంటే ధైర్యం, ప్రాణాలను పణంగా పెట్టగల మనోస్థితి లక్షణాలతో పాటు యుద్ధనీతి, పోరాట తంత్రాలు, ఆధునిక ఆయుధాలప్రయోగంలో మెలకువ, నైపుణ్యం… ఈ శక్తి యుక్తులన్నీ నేడు మహిళకు కరతలామలం. అన్ని రంగాలతో పాటు దేశ రక్షణలో అనునిత్యం అవిశ్రాంతంగా ప్రతికూల పరిస్థితుల మధ్య మన స్త్రీ శక్తి త్రివిధదళాలలో అమూల్య సేవలను అందిస్తున్నది. గతంలో వివిధ భారత సైనిక దళాలలో పురుషులు మాత్రమే ముందుండే మహిళలు త్రివిధదళాలలో ఉన్నప్పటికీ ప్రత్యక్ష యుద్ధరంగంలో క్రియాశీలక పాత్రలో ఉండేవారు కాదు. లాజిస్టిక్స్, ‌మెడికల్‌ ‌వంటి అనుబంధ క్షేత్రాలకే పరిమిత మయ్యేవారు.. నేడు అబలలు సబలుగా త్రివిధ దళాల్లో తమ శక్తి యుక్తులను నిరూపించుకుంటూ పురుషులకు దీటుగా సత్తా చాటుతున్నారు.”

సైన్యం త్రివిధ దళాల్లో శౌర్య మహిళలు ముదితల్‌ ‌నేర్వగరాని విద్యన్‌ ‌గలదే ముద్దార నేర్పించినన్‌… అన్న నానుడి ఈనాటిది కాదు. ఏనాటిదో… కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యోషు మాతా, … క్షమయా ధరిత్రీ నే కాదు. విద్య, వ్యాపార, వైద్య, సాహితి, సాంస్కృతిక, కళ, ఉద్యోగ రంగాలలో మహిళ ముందడుగులో ఉన్నారన్నది సత్యం. అనుగ్రహిస్తే అమ్మ. ఆగ్రహిస్తే కాళిక. రణరంగాన ఝాన్సీలక్ష్మి, రాణి రుద్రమ, మగువ మంచాల.. అని చరిత్రచెబుతున్నది. రణరంగంలో పోరాడి గెలవాలంటే ధైర్యం, ప్రాణాలను పణంగా పెట్టగల మనోస్థితి లక్షణాలతో పాటు యుద్ధనీతి, పోరాట తంత్రాలు, ఆధునిక ఆయుధాలప్రయోగంలో మెలకువ, నైపుణ్యం… ఈ శక్తి యుక్తులన్నీ నేడు మహిళకు కరతలామలం. అన్ని రంగాలతో పాటు దేశ రక్షణలో అనునిత్యం అవిశ్రాంతంగా ప్రతికూల పరిస్థితుల మధ్య మన స్త్రీ శక్తి త్రివిధదళాలలో అమూల్య సేవలను అందిస్తున్నది. గతంలో వివిధ భారత సైనిక దళాలలో పురుషులు మాత్రమే ముందుండే మహిళలు త్రివిధదళాలలో ఉన్నప్పటికీ ప్రత్యక్ష యుద్ధరంగంలో క్రియాశీలక పాత్రలో ఉండేవారు కాదు. లాజిస్టిక్స్, ‌మెడికల్‌ ‌వంటి అనుబంధ క్షేత్రాలకే పరిమిత మయ్యేవారు.. నేడు అబలలు సబలుగా త్రివిధ దళాల్లో తమ శక్తి యుక్తులను నిరూపించుకుంటూ పురుషులకు దీటుగా సత్తా చాటుతున్నారు.

ఇటీవల భారత నౌకాదళం ఎమ్‌హెచ్‌ 60ఆర్‌ ‌యుద్ధ హెలికాప్టర్లు నడిపే ఎయిర్‌ ‌బార్న్ ‌టాక్టీషియన్లుగా పని చేసే అవకాశం ఇద్దరు మహిళలకు దక్కింది. ఘజియాబాద్‌కు చెందిన కబ్‌ ‌లెఫ్టినెంట్‌ ‌కుముదునీ త్యాగి, హైదరాబాద్‌కు చెందిన సబ్‌ ‌లెఫ్టినెంట్‌ ‌రితీసింగ్‌, ‌కొచ్ఛీ దక్షిణ నావికాదళ కమాండ్‌ ‌నిఘా విభాగంలో కఠినమైన శిక్షణ పూర్తి చేసుకొని వ్యూహకర్తలుగా దక్కించు కున్నారు. బి టెక్‌ ‌కంప్యూటర్స్ ‌పూర్తి చేసిన ఇద్దరు నావికాదళ అధికారుల నాలుగో తరం సైనిక కుటుంబాల నుండి వచ్చి నేవీలో చేరారు. ఇటీవలే రాఫెల్‌ ‌యుద్ధ విమానాలు నడిపే దళంలోకి మరో మహిళా ఫైలట్‌ అం‌బాలా ‘గోల్డన్‌ ‌యారోస్‌’ ‌స్క్వాడ్రన్‌ ‌కు ఎంపికయ్యారని ప్రకటించారు.

1888లోనే బ్రిటీష్‌ ఇం‌డియన్‌ ‌మిలిటరీ నర్సింగ్‌ ‌సర్వీస్సుల్లో మహిళలప్రవేశం మొదలై, రెండు ప్రపంచ యుద్ధాలలో వారి సేవల వినియోగం ప్రారంభంమై సైన్యంలోని వివిధ నాన్‌మెడికల్‌ ‌విభాగాలలో షార్ట్ ‌సర్వీస్‌ ‌కమీషన్‌ ‌నియా•కాలు జరిగాయి. 2007లో యూయన్‌ ‌పీస్‌కీపింగ్‌ ‌ఫోర్స్ ‌లో 105 మందితో మహిళాదళం ఏర్పాటు చేసి లైబెరియాకు పంపారు. 1993లో మ్నెదటిసారి 25 మంది మహిళలు ఆర్మీ ఆఫీసర్లుగా బాధ్యతలు చేపట్టారు.. 2020న ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు మహిళను అన్ని స్థానాల్లోకి తీసుకోవాలని సుప్రీమ్‌ ‌కోర్టు తీర్పు ఇచ్చింది. 2020లో ఇండియన్‌ ఆర్మీ మెడికల్‌ ‌కోర్‌లో మాధురీ కనిత్కర్‌ ‌పదోన్నతి పొంది లెఫ్టినెంట్‌ ‌జనరల్‌గా విధులు నిర్వహించారు. 2020 రిపబ్లిక్‌ ‌డే పరెడ్‌లో పురుష జట్టుకు వనిత కెప్టెన్‌ ‌తానియా షేర్గిల్‌ ‌మ్నెదటిసారి నాయకత్వం వహించిన మహిళగా కీర్తి తెచ్చుకున్నారు.

భారత వైమానికదళంలో 1,875 మంది మహిళా అధికారులు పనిచేస్తున్నారు. వీరిలో 10 మంది పైలట్స్, 18 ‌మంది నావిగేటర్స్ ఉన్నారు. 1995లో ఇండో-పాక్‌ ‌యుద్ధంలో పాల్గొన్న మెడికల్‌ ఆఫీసర్‌ ‌ఫ్లైట్‌ ‌లెఫ్టినెంట్‌ ‌కాంతా హండా, 1999లో కార్గిల్‌ ‌వార్‌లో ఫ్లైట్‌ ఆఫీసర్స్ ‌సక్సేనా, శ్రీవిద్యా రాజన్‌ ‌పైలట్‌ ‌విధులను నిర్వహించి మహిళాశక్తిని నిరూపించారు. 2006లో దీపికా మిశ్రా, 2012లో నివేదితా వైమానిక దళంలో సత్తా చాటారు. 2016లో ఎంపికైన పది మంది మహిళలు పైలట్లుగ నియమితులైనారు. 2019లో భావనాకాంత్‌ ‌మ్నెదటి ఫైటర్‌పైలట్‌గా అర్హత పొందారు. ఇండియన్‌ ఎయిర్‌ ‌ఫోర్స్ ‌ప్రథమ పర్మనెంట్‌ ‌కమీషన్డ్ ఆపీసర్‌గా వింగ్‌ ‌కమాండర్‌ ‌షాలిజా ధామి ఎంపికైనారు. స్క్వాడ్రన్‌ ‌లీడర్‌ ‌మింటీ అగర్వాల్‌ ‌ప్రతిభకు గుర్తుగా యుద్ధ్ ‌సేవా మెడల్‌ ‌లభించింది. పద్మావతి బందోపాద్యాయ్‌ ‌త్రీ-స్టార్‌ ‌ర్యాంక్‌ ఎయిర్‌ ‌మార్షల్‌ ‌హోదాతో పనిచేసిన మ్నెదటి మహిళ. 1961 లో భారత నావికాదళంలోకి డా: బార్బారా ఘోష్‌ ‌మెడికల్‌ ఆఫీసర్‌గా, 1968లో నావీలో డా: పుణీత, 2018లో ‘ఐయన్‌యస్‌వి తరణి‘ వర్టికా, స్వాతి, ప్రతిభ, పాయల్‌, ఐశ్వర్య, విజయాదేవికి ‘నారీ శక్తి పురస్కార్‌’ ‌లభించింది. 2019లో శుభాంగీ స్వరూప్‌ ‌మ్నెదటి నావీ పైలట్‌గా నిరూపి ంచుకుంది.

భారత పారామిలటరీ దళాల్లోకి 2017లో ఇండియన్‌ ‌కోస్టల్‌ ‌గార్డ్ ఆఫీసర్లుగా నలుగురు మహిళలు ఎంపికయ్యారు. 2016లో అస్సాం రైఫిల్స్ ‌కు వంద మంది మహిళదళం చేరింది.. 30 మంది మహిళలు ఉమెన్‌ ‌రైఫిల్‌ ‌విభాగంలో వాస్తవాధీన రేఖ వెంట కెప్టెన్‌ ‌గుర్‌సిమ్రన్‌ ‌కౌర్‌ ‌నాయకత్వంలో విధులు నిర్వహించారు. అలాగే 1972లో స్పెషల్‌ ‌ఫ్రాంటీర్‌ ‌ఫోర్స్ ‌కు 500 మహిళలను వివిధస్థాయిల్లో నియమించారు. 1992లో సెంట్రల్‌ ఆర్ముడ్‌ ‌పోలీస్‌ ‌ఫోర్స్ ‌లో ఆశా సిన్హా ప్రథమ మహిళా కమాండంట్‌గా పనిచేశారు. ఆశాతో పాటు అర్చన డిజిపీగా పదవీవిరమణ చేసారు.సిఆర్‌పియఫ్‌, ‌సిఐయస్‌యఫ్‌ ‌లో 33 శాతం, బియస్‌యఫ్‌, ‌యస్‌యస్‌బి, ఆటిబిపిలలో 15 శాతం మహిళా రిజర్వేషన్లు ఏర్పడ్డాయి.. ఐటిబిపిలో 1500 మంది మహిళలున్నారు. నేషనల్‌ ‌సెక్యూరిటీ గార్డస్‌గా మహిళా కమెండోలను తీసుకున్నారు. 2013లో స్పెషల్‌ ‌ప్రొటెక్షన్‌ ‌ఫోర్స్ ‌కు మహిళలను ఎంపిక చేశారు. రైల్వే ప్రొటెక్షన్‌ ‌ఫోర్స్, ‌నేషనల్‌ ‌డిజాస్టర్‌ ‌రెస్పాన్స్ ‌ఫోర్స్ ‌కూడా మహిళలకు విస్తరించారు. తాము చేయలేని పని ఏదీ లేదని మహిళలు రుజువు చేస్తూనే ఉన్నారు. నిన్నటి అబల నేడు తెలివైన సబలగా పురుషులను మించి మెరుగ్గా విధులు నిర్వహిస్తున్నారు.

Leave a Reply